#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అద్భుతమంటే అభూత పూర్వమని అర్థం. అసలీ కథ అంతా అభూతమే. మహా భారతం లోనే ఉంది గదా అభూత మేమిటి. ఉన్నా అది కేవల మస్థి పంజర ప్రాయమే. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి సర్వాంగ సుందరంగా చిత్రించిన కౌశల మంతా కాళిదాసుది. ప్రఖ్యాత మైన ఇతి వృత్తాన్ని మిశ్రంగా మార్చాడు. అది కూడా దాటిపోయి ఉత్పాద్య కోటి నందుకొన్నాడేమో కూడా. చూడండి. దుర్వాస శ్శాప వృత్తాంతం మూలంలో లేదు. కేవలం కవి కల్పనే. గాంధర్వ వివాహ మున్నా అంగుళీయక మిచ్చి పోవటం లేదు. అదీ కల్పనే. మరి భరతుడితో సహా శకుంతల మెట్టినింటికి వెళ్ళినట్టు మూలంలో ఉంటే ఇక్కడ భరతుడింకా జన్మించనే లేదు. గర్భవతి గానే వెళ్ళింది శకుంతల రాజాస్థానానికి. కాగా అనసూయ లేదు ప్రియంవదా లేదు భారతంలో. కణ్వ శిష్యులున్నా రేమో గాని వారి పేర్లు శార్జరవ శారద్వతులని ఎక్కడా లేదు. వీరికి తోడు గౌతమి అనే ధాత్రి అసలే లేదు. ఈ పాత్రలన్నీ కవి కల్పితాలే. పోతే దుష్యంతుడి చేత నిరాకృత అయిన శకుంతలను దేవలోకం నుంచి వచ్చిన ఒక దివ్య తేజస్సావిడను భువి నుంచి దివికి చేర్చటం మూలంలో అసలే లేదు. ఇదంతా కాళిదాసు ఇంద్రజాలం. ఇంత కన్నా మహేంద్ర జాలం దుష్యంతుడు కూడా ఇంద్రుడు పంపిన రథంలో అక్కడికే వెళ్ళి అప్పటికే అక్కడ జన్మించిన తన కుమారుడు భరతుణ్ణి - అతని ద్వారా అక్కడే తన కోసం నిత్యమూ పరితపిస్తున్న తన కాంతను - కలుసుకొని ప్రజాపతిని దర్శించి ఆయన ఆశీర్వాదం పొందటం. మొత్తం మీద కథలో సగం ముప్పాతిక కాళిదాస కవి స్పష్ట

  కేవలం వినోదార్థం చేసింది కాదీ సృష్టి కూడా. బ్రహ్మాండమైన ప్రయోజన ముంది ప్రతి ఒక్క దానికీ. దుర్వాసుడి శాపమే లేకపోతే దుష్యంతుడికి జరిగిన వృత్తాంతం జ్ఞాపక ముండి తీరాలి. ఉంటే శకుంతలను కాదు పొమ్మని నిరాకరించ గూడదు. అది ఆత్మ వంచన లోక వంచన కూడా అవుతుంది. అలాటి నయ వంచకుడు ఒక దేశానికి పాలకుడని

Page 106

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు