#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

విదూషకుడితో ముచ్చటిస్తూ ఆశ్రమ పీడా పరిహార వ్యాజంతో వేటకు స్వస్తి చెప్పటం - ఇది ద్వితీయాంక వృత్తాంతం. ఇవి రెండూ కలిసి ముఖ సంధి అయితే ఇక మూడవ అంకంలో నడచిన శకుంతలా దుష్యంతుల సమాగమాభి లాష - చెలికత్తెల సహాకారంతో ఇరువురూ కలుసుకోవటం - వారి ప్రణయ . వృత్తాంతం ఈ కలాపమంతా ప్రతిముఖ సంధి క్రిందికి వస్తుంది. బీజ రూపంగా అంకురించిన ప్రణయం బిందురూపంగా విస్తరించటమే గదా ప్రతిముఖం. అదే ఇక్కడ జరిగిన విషయం. పోతే గాంధర్వ వివాహా నంతరం రాజు నగర ప్రవేశం చేస్తే కణ్వ మహర్షి ఆశ్రమ ప్రవేశం చేస్తాడు చతుర్ధాంకంలో. శకుంతలా దుష్యంతుల ప్రేమ కలాప రహస్య మామహర్షి గ్రహించటం ఆమోదించి అప్పటికే గర్భవతి అయిన ఆవిడను శిష్య సమేతంగా అత్త వారింటికి పంపటమూ ఈ అంకంలో సాగిన కథ. ఇది గర్భ సంధిలో పూర్వార్డ మైతే ఉత్తరార్ధం పంచమాంకంతో సమాప్త మవుతుంది. శకుంతలా దుష్యంతులు మరలా కలుసుకొన్నా శాప గ్రస్తులయి కలుసుకోవటం మూలాన అతడీవిడను గుర్తించక నిరాకరించటం నిరాశ్రయ అయిన ఆవిడను ఒకానొక దివ్య తేజస్సు భువి నుంచి దివికి తీసుకొని పోవటం జరుగుతుందిక్కడ. ఈ రెండు వృత్తాంతాలూ నాటక కథకు పరాకాష్ఠ కాబట్టి గర్భ సంధి క్రిందికి వస్తుందీ అంకద్వయం . పోతే ఇక షష్ఠాంకంలో అంగుళీయక దర్శనం. రాజు తన అపరాధం గుర్తించటం పశ్చాత్తాపం మాతలితో కూడి స్వర్గానికి ప్రయాణం - ఇది అవమర్శ సంధి. అవమర్శ మంటే మరలా ఒకమారు జరిగిపోయిన దాన్ని మనసుకు తెచ్చుకోవటమే గదా. అదే జరిగిందీ అంకంలో, ఇక చివరిదైన సప్తమాంకంలో కథలో దొరలిన సమస్యలన్నీ దేని పాటికది విడిపోయి మరలా నాయికా నాయకులు సుఖంగా కలుసుకొని కులదీపకుడైన కుమారునితో సహా ప్రజా పతిని దర్శించి ఆయన దీవన అందుకోవటంతో కథ సమాప్త మవుతున్నది కాబట్టి అది నిర్వహణ సంధి అవుతుంది. నిర్వహణ సంధిలో అన్నీ అద్భుతాలే జరగాలి. అలాగే జరిగాయి ఒక్కొక్కటీ ఈ అంకంలో.

Page 105

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు