#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అవగాహనకు వచ్చే విషయం కాదు. మిగతా రెండింటి లాగా కాక ఇది ఏడంకాల నాటకం. ఎక్కడో భూలోకంలో ఉన్న కణ్వాశ్రమం దగ్గరి నుంచి మొదలయి ఎక్కడో ఉన్న ప్రజా పతి లోకంలోని మరీచాశ్రమం వరకూ సప్తలోకాలు కలుపుకొని విస్తరించిన కథా వస్తువు కాబట్టి దానికి సూచకంగా సప్తాంకాలుగా విభజించి ఉండవచ్చు మహాకవి. లేదా అసలు దీని మూలంగా ఆయన మనసులో దాగిఉన్న కోరిక నిశ్రేయసమే కాబట్టి అది సప్తభూమికలను దాటి పోతేనే సిద్ధిస్తుంది కాబట్టి దానికి ద్యోతకం గానే చేసి ఉండవచ్చు ఈ విభాగం. ఇంద్రియాణి పరాణ్యాహుః - ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః - యో బుద్ధేః పరతస్తు సః అని గదా భగవానుడు సెలవిచ్చిన సప్త భూమికలు. ఈ భావానికి స్పోరకమే గదా పరీక్షిత్తు సప్త దివసాలు శుకముఖంగా శ్రవణం చేసి తరించాడనే భాగవతోదంతం కూడా. అయితే పంచ సంధుల మాటేమిటని ఆశంక రావచ్చు. అవి పంచాంకాలలోనే చూప నక్కర లేదు. పంచాంకాలనేది ప్రాయోవాదం. ఒక్కొక్క సంధి రెండేసి అంకాలలోకి చొచ్చుకొని పోయినా పోవచ్చు. తప్పేమి కాదు. సప్త ఏమిటి. దశాంకాల వరకూ విస్తరించిన నాటకాలు కూడా ఉన్నాయి గదా. వాటన్నిటికీ ఇలాగే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది మనం. ప్రస్తుతం శాకుంతలంలో ఏడంకాలలోనూ కాళిదాసు సంధి పంచకాన్ని ఎలా పొందుపరిచాడో చూతాము. ప్రధమ ద్వితీయాంకాలు రెండింటిలో ముఖ సంధి విస్తరించి ఉంది. దుష్యంతుడు వేటకు రావటం కణ్వుడు లేని సమయంలో ఆయన ఆశ్రమంలో ప్రవేశించటం - శకుంతలా వీక్షణం- అనసూయా ప్రియం వదల వల్ల ఆవిడ జన్మ వృత్తాంతం తెలుసుకోవటం పరస్పరాను రాగోదయం. ఇంతలో మదగజ ప్రవేశం - తన్మూలంగా ఏర్పడిన విఘ్నాన్ని రాజు నివారించటం ప్రథమాంకంలో ఇతివృత్తం. అది గమనించిన తాపసులు తమ అనుష్ఠానానికి నిత్యమూ విఘ్నకరులైన రక్షః పిశాచాదులను పారదోలటానికి రాజును కొంత కాల మక్కడే ఉండమని ప్రార్దించటం రాజు రెండందాల అది తనకు అనుకూలమని భావించి అంగీకరించటం శకుంతలా సౌందర్యాన్ని

Page 104

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు