రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కోరిక ఇది. ఇలాటి కోరిక ఒక కళాకారుడికి జీవితంలో ఎంతో సంతృప్తి కలిగితే గాని ఏర్పడదు. షేక్సయరు పోతన లాటి మహా కవులకు కూడా ఇలాటి ఆకాంక్ష కలగటమే చూస్తాము మనం వారి రచనలలో కాగా కాళిదాస మహాకవికి కలిగిన ఈ ఆకాంక్షలో ఒక విశేషముంది. నీలలోహితః పరిగత శక్తిః ఆత్మ భూ:- ఏవం విధ విశేషణ విశిష్టుడైన తన ఇష్ట దైవతమే తీర్చాలట తన కాంక్ష. నీల లోహితు ఉంటే ఈశ్వరుడు. నీల మేమిటి- లోహిత మేమిటి. నీలం తమస్సుకూ లోహితం రజస్సుకూ చిహ్నం. ఆవరణ విక్షేప శక్తులని అర్ధం. అవి రెండూ అమ్మవారి రెండు ముఖాలు. అవి ఎవరి వశంలో ఉంటే పరాశక్తి వారి వశంలో ఉంటుంది. అప్పుడే అతడు పరిగత శక్తి అవుతాడు. శక్తి నాధారం చేసుకొని తానుండడు. తనపాటికి తానే ఉంటాడు. అదే ఆత్మభూః అంటే అర్ధం. తన పాటికి తాను స్వతంత్రుడుగా ఉంటూ తన శక్తిని తాను వశీకరించుకొని ఏది కావలిస్తే అది చేయగలడు. తాను సర్వజ్ఞుడూ మృత్యుంజయుడూ అయినట్టే తన్ను ప్రత్యభిజ్ఞా సూత్రంతో పట్టుకొన్న సాధకుణ్ణి కూడా సర్వజ్ఞుణ్ణి మృత్యుంజయుణ్ణి కావించ గలడు. అలా పట్టుకొన్న కళారాధకుడూ సాధకుడే ప్రస్తుతం కాళిదాసు. కాళీ మహా కాలుల కిద్దరికీ దాసుడే ఈ సాధకుడు. ఇద్దరని కాక ఇద్దరినీ అవినాభూతమైన ఒకే ఒక అఖండ తత్త్వంగా దర్శించినవాడు. జీవితాంతమూ భజించిన వాడు. వాగ్రూపంగా సాగిందా భజన. ఆ వాక్కు ద్వారా తాను కోరిన అర్ధాన్ని అంటే పరమార్ధాన్ని శ్రవ్య రూపంగా శ్రవణం చేశాడు. దృశ్యరూపంగా డాన్నే దర్శనం చేశాడు. చివరకా శ్రవణ దర్శనాలు రెండూ ఏకమై భావ స్థిరమై ఎన్నో జన్మల నుంచీ అబోధ పూర్వంగా నిలిచి పోయిన శివశక్తి సామరస్య రహస్య జ్ఞానాన్ని స్వానుభవానికి తెచ్చి ఉంటుందా మహా ద్రష్టకు. దాని మధురోద్గారమే చిర స్మరణీయ మైన ఈ భరత వాక్యంలోని రమణీయ భావం.
ఇలాంటి మహోదాత్తమైన ఆశయంతో రచించిన ఆ నాటక మెంత మహోజ్జ్వలంగా సాగి ఉంటుందో ఇక మన మడుగడుగునా ఆగి చూస్తే గానీ
Page 103