#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సేవించబోతూ తోడి అప్సరసలతో కథా నాయిక అయిన ఊర్వశి రాక్షసుల బారిన బడిపోతుంది. వారు మొరపెట్టగా విక్రము డావిడను విడిపిస్తాడు. ఇరువురికీ హృదయాలు అనురాగ రసంతో ఆర్ద్రమవుతాయి. అయినా అతకక ముందే విడిపోవలసి వస్తుంది. దీనితో ప్రథమాంకానికి తెరపడి ద్వితీయాంకం మొదలవుతుంది. రాజుగారు పారవశ్యంలో పడి ఊర్వశి పేరుతో పట్టమహిషిని పిలుస్తాడు. ఆవిడ కనుమాన మేర్పడుతుంది. తరువాత రాజు విదూషకుడు చిత్రలేఖనం తదేక దర్శనం. ఇంతలో ఊర్వశీ చిత్రలేఖల అవతరణ. చాటుగా రాజు అభిలాష చూచి మురిసిపోవటం. బయట పడి ఒకరినొకరు పలకరించటం. ఇంతలో దేవేంద్రుని ఆదేశం మేర కావిడ స్వర్గానికి వెళ్ళ వలసి రావటం. రెండవ అంకానికి తెర. తరువాత మూడవ అంకంలో దేవి రాజు మీద అలిగి మరలా పశ్చాత్తాపంతో చంద్రవ్రతాప దేశంతో రాజును ప్రసన్నుణ్ణి చేసుకొనే ప్రయత్నం. ఈ లోపల ఊర్వశి రాక. వారి అనురాగం చూచి దేవి ఆవిడ నాయనకు కట్టపెట్టటం జరిగి పోతుంది. పోతే నాలుగవ అంకంలో ఊర్వశి స్వర్గంలో లక్ష్మీ నారాయణ పరిణయ మనే నాటకాన్ని ప్రదర్శిస్తూ నాటకంలో లక్ష్మీ పాత్ర తాను ధరించి నారాయణుణ్ణి పురుషోత్తమ అనబోయి పురూరవ అని సంబోధిస్తుంది. తన్నిమిత్తంగా గురుజన శాపానికి గురి అయి ఆ మనో వేదనతో స్త్రీ జన నిషిద్దమైన కుమార వనం ప్రవేశించి లతాంగి లతగా మారిపోతుంది. ఇక చూడండి ఆ రాజు తన ప్రేయసి జాడ గానక పడిన వేదన ఇంతా అంతా గాదు. చతుర్ధాంక మంతా ఆయన విరహ వృత్తాంత వర్ణనమే. చేతనాచేతన ప్రకృతి అంతా ఆయన స్పందనకు ప్రతి స్పందన అయిపోతుంది. కిష్కింధ కాండలో రాముడి విరహ విషయం హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి ఉంటుంది కాళిదాసుకు. రామాయణ చ్ఛాయలే కనిపిస్తాయి అడుగడుగునా. ఆ భావాలే వేరొక మూసలో బోసి ఇక్కడికి పట్టుకు వచ్చాడు సందేహం లేదు. ఒక విధమైన గేయ కావ్యమీ అంకం. పిల్ల మేఘ సందేశం. తరువాత ఇక పంచమాంకంలో దేవేంద్రుడి అనుగ్రహం. తద్వారా ఆయువనే కుమారుడితో సహా ఆవిడను పురూరవుడు శాశ్వతంగానే

Page 101

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు