#


Index

చిత్రతరంగిణి

ఏదైనా ఇంతే. మొదట దేశానికి, తరువాత జాతికీ, తరువాత వారి నాగరికతకూ ఈ క్రమంలోనే ఏర్పడుతుంది వ్యవహారం. ప్రస్తుతం ఈ హిందూ అనే వ్యవహారం కూడ ఇలాంటిదే. నదీప్రాయమైన దేశానికి మొట్టమొదట వాచకంగా ఏర్పడి ఆ తరువాతనే మన మతానికి కూడ వాచకమైంది.

  ఆలోచిస్తే నదులకూ మానవుల నాగరికతకూ చాలా దగ్గిర సంబంధమున్నది. నది అంటే జలమే గదా. జలానికి నారమని పేరు. నారమంటే సరులకు సంబంధించినదని అర్థం. నరుల విజ్ఞాన వికాసానికి తోడ్పడేది వాస్తవంలో జలమే. జలం వల్లనే మన శరీరాలేర్పడ్డాయి. జలమే మన శరీరంలో చాలా భాగం వ్యాపించి ఉన్నది. ఉపనిషత్తులు చెప్పినట్టుగా జలం యొక్క సూక్ష్మ తమాంశమే ప్రాణశక్తి. అది లేకపోతే మానవుడే లేడు. కాబట్టి శరీరాస్తిత్వానికి ఎలా ఆధారమో అలాగే శరీరాంతర్గతమైన మనోవికాసానికి కూడా పరంపరయా అదే కారణం. అంతేకాదు. నదీ జలాల వల్లనే శుష్కమైన భూభాగం సారవంతమవుతుంది. సారవంతమయినపుడే నానా విధములైన పంటలు పండుతాయి. దానివల్ల ప్రజలకు ధాన్యమూ పశువులకు గ్రాసమూ లభిస్తుంది. తన్మూలంగా పాడికీ పంటకూ కొఱత లేకుండా పోతుంది. పాడి పంటలుంటే ఇక కావలసిందేముంది. భౌతికమైన సమృద్ధి ఏర్పడిందంటే చాలు. అది సహజంగానే మానసికమైన అభ్యుదయానికి తోడ్పడుతుంది. దానితో మానవుడు సర్వతోముఖమైన నాగరికత నార్జించగలడు. ఇలాంటి గుప్తమైన సంబంధమొకటి ఉండటం మూలాన్నే మీరేదేశ నాగరికతనైనా తీసుకొని చూడండి. నదీప్రాంతాలలో మనుగడ సాగించిన జాతికే మొదటినుంచీ గొప్ప నాగరికత ఏర్పడుతూ వచ్చింది. మనమీనాడు చారిత్రకంగా గొప్ప నాగరికత సంపాదించిన వని కొనయాడే జాతులన్నీ ఇలాంటివే. ఈజిప్షియనుల నాగరికతకు నైలునది మూలం. పారశీకుల నాగరికతకు యూఫ్రెటిస్ టైగ్రెసు నదులు కారణం. చైనీయుల నాగరికతకు అక్కడి యల్లోనది హేతువు. అలాగే మన హైందవుల సంస్కృతికి కూడా ఇక్కడి గంగా యమునానదీమతల్లులే నిదానం. ఇలా అన్వేషిస్తూ పోతే నదులవల్లనే మానవుల నాగరికత అభివృద్ధి అవుతూ వచ్చింది. అంతేకాదు. అలాంటి నదీజల సౌకర్యానికి నోచుకోని ఎడారులు అడవులూ పర్వత ప్రాంతాలలో పుట్టి పెరిగిన జాతులకు

Page 98

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు