#


Index

చిత్రతరంగిణి

దాటుకొని వచ్చు బాల వత్సములు అం కెలం బొదివి కాలుద్రవ్వి కోరాడు వృషభములు - అందంగా కనిపిస్తాయి. మరి ఉరుద్రాళ్లు తలుగులు తల మొలలం జుట్టి ఇట్టు కలయం బాటి క్రేపుల నేర్పటించువారు కొందరైతే- వల్లియలు వైచి కోడెలం బట్టి పెనచి కాలురులంబట్టి జట్టి కాండ్రకు వసంబు చేయు బరవసం బెసగం గ్రుమ్మరు వారు కొందరు. చూడంగొడుపులును పాదోళ్లుముకు బంతులు మొదలుగాగల సాధనంబులుగొని తెచ్చి తెవులు గొంటులం జికిత్సంచువారును క్రేవులం గొన ని ఆవులం దొలంగం గట్టి పిళుల వెట్టియు - మందులు సల్లియు చాల దుఃఖపఱిచి చేపెఱింగించు వారును - మరికొందరు 'ఇలా పసుల కాపరులైన గొల్లల వ్యవహారాన్ని వర్ణించిన తీరు కూడా ఎంతో మనోహరంగా కనిపిస్తుంది.

వృద్ధులగు గోప ముఖ్యులు వేడ్కఁ దన్ను నెదురు కొని యభినందింప నింపు మిగులు తాను సందఱ నధిక హృద్యముగఁబలికి

  యాదరించుచు-" వారితో కలిసి వెళ్లాడట నంద గోపుడు. పల్లె వాసుల ఆప్యాయిత లలాంటివి.

  పూతన బాలకృష్ణుని చంపటానికి వచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. దాని ఆర్తనాదం విన్నప్పుడే యశోదకు మెళకువ వచ్చింది. భయపడి నందుని పిలిస్తే ఆయన పరుగెత్తుకొని లోపలికి వస్తాడు. పూతన కళేబరం మీద ఆడుకొనే బాలుణ్ణి చూచి

ఆకట నే జెల్ల నేజెల్ల హా కుమార హాతనూభవ హావత్స యనుచు నార్తి

  దల్లియును దండ్రియును వచ్చి తనుజు బొదివిరట, బాలుని గ్రుచ్చి యెత్తి యశోద యురం బున నదిమికొన్నదట. నందు డిదియేమి నీవేల యేమఱితివని ఆవిడను మందలిస్తాడు. అప్పుడావిడ అన్న మాటలు వినండి.

కడుపు నిండ గ జన్నిచ్చి కొడుకు నిద్ర పోవ-దీవియ మండంగ - బ్రొద్దుపోవు

Page 83

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు