#


Index

చిత్రతరంగిణి

ప్రబంధ పరమేశ్వరుడికి జానపద జీవితరంగంలో ఎలాంటి పరిజ్ఞానముందో ఆయన రచించిన హరివంశ మహాకావ్యాన్ని తిలకిస్తే మనకాశ్చర్యం గొలుపుతుంది. ముఖ్యంగా నందగోవుని నివాసమైన వ్రేపల్లెలోని స్త్రీ పురుషల జీవితాన్నీ - శ్రీకృష్ణుని బాల్య క్రీడలనూ వర్ణించిన ఘట్టమంతా జానపద జీవితాన్నంతటినీ చక్కగా ప్రతిబింబించే ఒక పెద్ద నిలుపుటద్దం లాంటిది. మధురాపురంలో నివసించే వసుదేవాదుల జీవనం నాగరిక జీవనమైతే గోకులంలో మెలగే యశోదా నందాదులది అచ్చమైన జానపద జీవితమే. ఎఱ్ఱాప్రెగడ ఎక్కడ చూచాడో ఏమోగాని కండ్లకు కట్టినట్లు వర్ణించాడా సన్నివేశాన్ని. బాగా జానపదుల జీవితంలో చొచ్చుకొని పోయినవాడు గాని అలా వర్ణించలేదు. మూలగ్రంథమైన సంస్కృత హరివంశంలో కూడా ఈ సందర్భ మింత సమంజసంగా ఇంత సుందరంగా కానరాదు.

  నందుడు వసుదేవుని ఆజ్ఞాను వర్తి. గోకులాని కధిపతి. వసుదేవుని ఆదేశాన్ని తలదాల్చి అతడు బాలకృష్ణుని తన మందకు తీసుకెడుతున్నాడు. అలా తీసుకెడుతున్న దృశ్యాన్ని వర్ణించే మొదటి పద్యాన్నే చూడండి ఎంత అద్భుతంగా ఉందో.

"పురిటి పాపని తొట్టెలో పొందుగాగ పెట్టి మోపించుకొని తాను ప్రియసతియును మేటి గు జ్జులం గట్టిన పాటబండి యెక్కి శీఘ్రంబ మందకు నేగె నెలమి".

  కుఱ్ఱ వాణ్ణి బండ్లో తీసుకెళ్ళలేదు. అలా తీసుకెళ్లితే ఆ బండి కుదువు నా శిశువు తట్టుకోలేదు. అంచేత ఒక ఉయ్యల తొట్టిలో మెత్తని పరుపు మీద పడుకో బెట్టి మనుషులు ముందు మోసుకొని నడుస్తుంటే వెనక మంచి బలిసిన ఎడ్లను కట్టిన బండిలో సతీసమేతంగా కూచుని తాను బయలుదేరాడట.

  ఇక దారిలో పనయమై పోతూ చివరకు యమునా తీరానికి దగ్గరగా ఉండే తమ పల్లె ప్రవేశించే లోపల ఆపరి సరాన్ని వర్ణించే ఒక దీర్ఘమైన వచనముంది. అందులో కవి చిత్రించిన సుందరమైన దృశ్యాలిన్ని అన్నిగావు. నలుదెసల పొడవుగా నమర్చిన ముండ్ల కంచెలు గల పెద్దపెద్ద దొడ్లు - వేకువనే మేపులు మేసి అక్కడ నెమరు వేయు కదుపులు- పేరు పేరున పిలువగా పంచి తిల్లుచు హుంకారము చేయుచు ఉన్ముఖలగు తల్లులకు అభిముఖముగా ప్రతి నినాదము చేసి ఒండొంటిని

Page 82

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు