#


Index

చిత్రతరంగిణి

సర్వదేవతా స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు

శివుడవో - మాధవుడవో అని గొంతెత్తి ఆలపించాడు వాగ్గేయకార సార్వభౌముడు త్యాగరాజస్వామి. ఆయన కిలా ఆలపించమని నూరిపోసిన అచార్యుడెవెరు. భక్తి జ్ఞాన పారమ్యాన్ని చవి చూచిన బమ్మెర పోతనామాత్యుడు. 'చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని' అని శివకేశవుల నిద్దరినీ ఆరాధ్యులుగానే భావించాడు. అంతే కాదు కృష్ణుని బాల్యచేష్టలు వర్ణిస్తూ, 'తనువున నంటిని ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పూతగాగ అంటూ కేశవునిలోకూడా శివతత్త్వాన్నే దర్శించాడు. మరి ఆయనగారికి పాఠం నేర్పిన గురు వెవరు. మహాకవి నాచన సోమనాథుడు. 'పరివాదాస్పద వాద మోద మదిరా పానంబుచే మత్తులై హరి మేలంచు హరుండు మేలనుచు నాహో కొందఱో పొందెఱుంగరు - కైలాసనగంబు నందు మును లేకత్వంబు భావించి రాముర వైరింబురవైరి బాపుట మహామోహం' బని వాపోయా డాయన. ఇలాంటి ఏకత్వదృష్టి ఆయన కెవరివల్ల అలవడింది. హరిహరా భేదదర్శన మాపాదమస్తకమూ పోత పోసిన కవి బ్రహ్మవల్ల 'కిమస్థి మాలామ్ కిము కౌస్తుభమ్ వా' అని ముద్దుగా ప్రశ్నిస్తా Cయన హరిహర నాథుణ్ణి. “విష్ణురూపాయ నమశ్శివాయ" అని ముక్త కంఠంతో లోకానికంతా చాటుతాడు.

  ఆయన అలా చాటాడంటే ఆశ్చర్యమేముంది. శివాయ విష్ణురూపాయ అని త్రిసంధ్యలలోనూ మనం జపిస్తూనే ఉన్నాము గదా. పైగా 'యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి' అని కూడా శపథం చేస్తున్నాము. ఈ అంతరం శివకేశవులకే గాదు. ఆ మాటకు వస్తే బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు ముగ్గురికీ లేదు. 'ఏకైవమూర్తి ర్బి భిదే త్రిధా సా' అని ఎప్పుడో ఘోషించాడు కవి కులగురువు కాళిదాస మహాకవి. ఒకే మూర్తి మూడు రూపాలుగా భిన్నమయిందట. సృష్టి స్థితిలయాలే అందుకు నిమిత్తం. అది లేకపోతే అంతా కలిసి ఒక్కటే ఆ ఒక్కటే జగత్సృష్టి చేయవలసి బ్రహ్మ అయింది. చివరకంతా తన స్వరూపంలో లయం చేసుకోవలసి ఈశ్వరుడయింది. సృష్టిస్థితి లయాలు ప్రకృతి ధర్మాలు. తదనువిధాయి అయిన పరమాత్మ భూమికలే ఈ త్రిమూర్తులు. కనుకనే మూడింటికీ భేదం లేదు. భేదం లేదనే రహస్యం వారి

Page 75

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు