#


Index

చిత్రతరంగిణి

పద్యాన్నిలా బింబప్రతిబింబ రూపంగా మలచి చూపటం తిక్కనకొక సరదా. ఇది కేవలం వినోదం కోసం గాక ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తాడు మహాకవి. ఇంతెందుకు. భవదాజ్ఞా దృఢబంధ సంయమిత అని ఒక పద్యముంది. ఇది విరాటపర్వం మొదట్లో వస్తుంది. సరిగా ఇలాంటిదే బలమత్తాకృతియైన అనే పద్యమొకటుంది. అది ఉద్యోగపర్వం మధ్యలో వస్తుంది. దీనికీ దానికీ ఎంత దూరముందో చూడండి. అయినా ఒక అంతరంగికమైన సంబంధముంది రెండింటికీ. ఇందులో మొదటిది భీముడు అర్జునుడి పరాక్రమాన్ని వర్ణిస్తూ చెబితే, రెండవది అర్జునుడు భీముడి బలాన్ని వర్ణిస్తూ చెప్పింది. అన్నదమ్ములకు పరస్సర ముండే అభిమానం, ఒకరి శక్తిమీద ఒకనికున్న విశ్వాసమిందులో వ్యంగ్యంగా సూచిస్తున్నాడు. కవి. అంతేకాదు. ఇంత బలపరాక్రమాలున్నా ఇరువురూ తమ అన్న ధర్మరాజు మాట ఎలా జపదాటరో కూడా నిరూపిస్తాడు. మొత్తానికి భారతకథ అంతా ఈ రెండు పద్యాల్లో సూచితమైనట్టే భావించాలి మనం. భీమార్జునుల ఇరువురిని మత్తేభాలతో పోలుస్తూ కవి రెండు చోట్లా మత్తేభ విక్రీడితాలనే వ్రాయటం కూడా గమనించవలసిన విషయం.

  పోతే ఇక రసాన్ని అనుకరించటం. అప్పటికప్పుడు రసోత్పాదకమైన సన్నివేశమేదీ లేకపోయినా ఉంటే ఎలా ఉంటుందో భావించి దాన్ని అనుకరిస్తుందొక్కొక్క పాత్ర. అలాంటిది కూడా అతిలోకంగా వర్ణిస్తాడు తిక్కన సోమయాజి. ఉదాహరణకు భీముడు కీచకుణ్ణి సంహరించే రిహార్సులు చూడవచ్చు. ఇది నిజంగా నాటకానికి ముందు జరిగే రిహార్సలు లాంటిదే. ద్రౌపది ఎదుట తాను చేయబోయే పరాక్రమ చర్యనంతా నటించి చూపుతాడు భీముడు. ఇది నిజంగా వీరమా, హాస్యమా ఏ రసమో మనం చెప్పలేము. రుసానుకరణ మిది. ఎంతో అద్భుతంగా పోషిస్తూపోయాడు 52.

  రసపోషణ అంతా ఒక ఎత్తు. ఆ రసాన్ని భావకుడి హృదయంలో బాగా పాదుకొల్పటానికి కవి సమకూర్చే సామాగ్రి ఒక ఎత్తు. ఈ సామాగ్రి పద్య రచన దగ్గరి నుంచి కవి ఎన్నుకొనే భావాల వరకూ ఉంటుంది. పద్యరచన అంటే సామాన్యమైనది కాదు అది ఒక కళ. అందరికీ పట్టుపడదది. శిల్పమునం బారగులైన తిక్కనలాంటి మహాకవులకే దక్కిన సొత్తు. ఏ రసానికే పద్యంలో వ్రాయాలో ఆయనకు

Page 235

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు