#


Index

చిత్రతరంగిణి

పద్యంలో మరణభయంతో ఆవిడ చేసే ఆక్రందన దాకా మధ్యలో ఎన్ని పోకడలు పోయిందో ఈ రసపోషణ చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఇలాంటి వైవిధ్యం చూస్తే నాకు త్యాగరాజస్వామి కీర్తనలు జ్ఞాపకం వస్తాయి. ఒక రాగంలో పది కీర్తనలు కడితే ఆ మహానుభావుడొకొక్క రాగంలో ఒక్కోక్క కీర్తన కట్టినట్టుగా భాసిస్తుంది. అలాంటిదే తిక్కన కౌశలం కూడా.

  పోతే మరొక్క విశేషమేమంటే ఒకరసంలో ఇంకొక రసాన్ని జోడించటం. వీలైతే ఆ రెంటిలో మరొకదాన్ని కూడా మిళితం చేయగలడు తిక్కన. ఇది సంగీతంలో రాగమాలికలాగా ఒక అపూర్వమైన శోభనిస్తుంది రచనకు. అంతేకాదు. రాగమాలికలో లేని విశేషమొకటుంది ఇందులో. రాగమాలికలో పరస్పరం సరిపోయే రాగాలే కూర్చాలి. ఇక్కడ అలా కాదు. పరుస్పర విరుద్ధ భావాలు కూడా కూర్చగలడు కవి. అలా కూర్చి మెప్పించగలడు కూడా. వనితా యేనొక పల్కు పల్కెద అని కీచకుడు సుదేష్ణతో నాడిన మాటలలో శృంగారంలో వీరరసం కలయిక. దేవి తృష దీర్ప అని కీచకుడు సైరంధ్రితో అన్న మాటలో శృంగారంలో హాస్యం. నన్నిటు లాదురాత్ము అనటంలో కోపదైన్యాలు. నీవింత యలుగనేటికి అనే ద్రౌపది అన్నమాటలో ధైర్యము హాస్యము. ననుముట్టి నీవు వెండియు అనటంలో వీరహాస్యాలు. ఇలా ఎన్నో సన్నివేశాలున్నాయి.

  ఇంకా ఒక గొప్ప విశేషముంది తిక్కన రసపోషణలో. ఒక సందర్భంలో ఒకపాత్ర రసావేశంతో పలికిన పలుకులే మరొక సందర్భంలో కూడా పలుకుతుంది. అయితే మొదట పొందినది సహజమైన ఆవేశమైతే తరువాత అది ఆరోపించుకొన్న ఆవేశం. లేదా అనుకరించే ఆవేశమో అయి ఉంటుంది. ఇది ఒక చమత్కారకమైన శిల్పం. చూడండి. దుర్వారోద్యమ అనే పద్యం సైరంధ్రి మొదట భీముణ్ణి మహానసంలో ఏకాంతంగా కలుసుకొన్నప్పుడూ కూడా చెబుతుంది. అయితే అప్పుడు వీర రసావేశాన్ని అభినయిస్తూ చెప్పింది. ఇప్పుడలాంటి ఆవేశమేమి లేదు. కాని జరిగిన వృత్తాంతమే కరువుపెడుతూ ఉంది కాబట్టి ఆవేశం లేకపోయినా ఇలా అన్నానని కేవలం దాన్ని పరామర్శిస్తూ చెప్పింది. అందులోనూ పద్యం తూచా తప్పకుండా మక్కీకి మక్కిగా పునరుక్తం చేశాడు మహాకవి. ఇందులో ఒక లోతైన రహస్యముంది. భీముడిని

Page 233

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు