అదే అంజలి పుట ఘటన. ఆ ఘటనకు కూడా కారణం శకుని మాయోపాయమే. అది ధర్మజుని మనస్సు నాకర్షించింది. మానసా కృష్టి విద్య అనే మాట దానినే ధ్వనింప జేస్తున్నది. అది కోలుపోయి ధర్మజాదులరణ్యాలపాలై తమ వాడు రాజ్యం చేస్తుంటే చేరి ఓం భాయులు పడుతున్న కర్ణశకుని దుశ్శాసనాదులే బాంధవులు. ఆనందంతో విప్పారిన వారి ముఖాలే విశాలాంబక కుముదవని. వారికధీనమైనాడని చెప్పటానికే బాంధవాయత్త అని చెప్పటం. బాంధవులతో కలిసి మెలసి రాజ్య సుఖాలను భవించటమే అతని ముఖవికాస హేతువు. అదే యావజ్జీవమూ దుర్యోధనుడు కాంక్షించింది. కాని ఏమి సుఖం. అన్యాయార్జితమైన ఐశ్వర్యమెంతో కాలం నిలువదు ఎప్పటికైనా దెబ్బతగిలి తీరుతుంది. వీని పాతం తప్పదని చెప్పటానికే చివర నాగేంద్ర కేతున్ అని ప్రయోగించాడు తిక్కన. నాగేంద్ర మంటే సర్పం. అదే ధ్వజ చిహ్నం దుర్యోధనుడికి. ఇది పై అర్థం. అంతరార్థమేమంటే సర్పమంటే రాహువు. కేతువంటే కేతుగ్రహమే. రాహుకేతువులు ప్రక్కనే పొంచి ఉన్నారు. చంద్రుడికి ముప్పు తప్పదు. దానితో వెన్నెల కూడా మాసిపోతుంది. అంటే దుర్యోధనుడెంత ఐశ్వర్యమనుభవించినా అతని స్వభావం సర్పంలాగా విషపూరితం. తన్మూలంగా బలవద్విరోధం కొని తెచ్చుకొంటాడు. శత్రువులని వారితో యుద్ధమని పేరేగాని చివరకు తన దుష్టస్వభావమే తన్ను కాటువేసి చంపుతుంది. దానితో తన ఉత్సాహమంతా అడుగంటుతుంది. తన్నాశ్రయించుకొని బ్రతికే బంధువల బ్రతుకు కూడా బండలవుతుందని బ్రహ్మాండమైన భావ్యర్థ సూచన కూడా ఉన్నదీ మాటలో. మొత్తం మీద ఇది ఒక్కటే ఒక పద్యమైనా కొండ మిరపకాయ మాదిరి ఎంతో ఘాటైన పద్యం. మొత్తం భారతకథ అంతా భంగ్యంతరంగా ఇందులో గుప్తం చేసి వ్రాశాడా అనిపిస్తుంది మహాకవి. ఇది రసంలో ఉండే గాంభీర్యం.
పోతే గాంభీర్యమేగాక ఎంతోవై చిత్రి Varity కూడా ప్రదర్శిస్తాడీ మహాకవి. ఒక రసాన్ని పోషించేటపుడు కూడా ఎన్నో ఛాయలూ ఎన్నో అంతస్తులూ కనిపిస్తాయి. దేనికది కొత్తదా అనే భావాన్ని ఆపాదిస్తుంది. ఇది మరొక కవిలో ఎక్కడా కానరాని అంశం చూడండి. ద్రౌపదీ గతమైన కరుణరసం ఒక్కొక్కచోట ఒక్కొక్క భంగిమలో కనిపిస్తుంది. డప్పి జనించే వ్రేళుల పుటంబులు పొక్క దొడంగె అనే పద్యంలో ఆవిడ దూర ప్రయాణం చేయలేక బాధపడటం దగ్గరి నుంచీ ఆ నతవైరి యోజయ అనే
Page 232