#


Index

చిత్రతరంగిణి

నానాత్వమనేది అన్ని రసాలను పోషించటంలోనే కాదు. ఒక్కొక్క రసంలో ఎంత లోతుందో ఎంత వైవిధ్యముందో నిరూపించటంలో కూడా కనిపిస్తుంది తిక్కన కౌశలం. అంతెందుకు. మౌళి స్రక్సంగరంగత్తనే పద్యాన్నే తీసుకొని చూస్తాము. ఇది అద్భుత రసాన్ని చిలకరించే పద్యం. కొలువు తీరి ఉన్న దుర్యోధనుడిని వర్ణిస్తున్నాడు కవి. తిక్కన దుర్యోధనుణ్ణి మనకు పరిచయం చేయటమిదే మొదటిసారి. ఆ మహాకవి చూచిన దుర్యోధనుడెలాటి వాడో అతడి హుందాతన మెలాంటిదో ఈ పద్యం కొట్టివచ్చినట్టు చూపుతుంది మనకు. దుర్యోధనుడిలో అన్నిటికన్నా ప్రధానంగా ఉన్న గుణాలు అభిమానం, దర్జా. అందరూ తన చుట్టూ చేరి తన్నుకైవారం చేస్తుండాలనే అభిలాష, యావ దైశ్వర్యమూ తనకే ఉండాలనే ఆకాంక్ష, ఇవే గదా. ఇవే మొదటి నుంచీ చివరిదాకా అతడి జీవితంలో మనకు కనపించేవి. వాటి మూలంగానే అతడు పైకీ వచ్చాడు. వాటి మూలంగానే చివరకు దెబ్బతాన్నాడు. సరిగా ఇదే వర్ణిస్తాడు తిక్కన ఈ పద్యంలో. రాజులందరూ అతని పాదలకు వరసగా వచ్చి మ్రొక్కుబడి చెల్లించి వెళ్ళుతున్నారట. అలా మొక్కుతున్నప్పుడు వారు చేతులు జోడిస్తే అవి ముకుళించిన పద్మాలలాగా ఉన్నాయి. అవి నిజంగా పద్మాలేమోనని శిరస్సుల మీద ధరించిన పుష్పమాలలు వదిలేసి తుమ్మెదలు వాటి మీద వాలుతున్నాయట. అది చూచి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆనందిస్తున్నారట బంధువులంతా. వారి కండ్లు వికసించిన కలువల లాగా ఉన్నాయట. పోతే దుర్యోధునడి ముఖం చంద్రమండలం లాగా ఆ ముఖంలో అంకురించిన చిరునవ్వు వెన్నెలలాగా, వెలిగిపోతూ ఉంది. దానితో ఆ మనిషి రెండింతలుగా కనిపిస్తున్నాడట. వెనుకనే అంతకన్నా ఎత్తుగా ఆయనగారి నాగకేతనం కనిపిస్తూ ఉంది. ఇది ఈ పద్యంలో భావం ఇది మామూలుగానే ఎంతో బాగుంది. ఇంత మాత్రమే గాక కొంచెం లోతుకు దిగిచూస్తే తిక్కన మహాకవి ఇందులో ఎంత మర్మంపెట్టి వ్రాశాడా అని మరి ఒక అద్భుత రసం కలుగుతుంది మనకు.

  భారతంలో దుర్యోధనిడి జీవితమంతా భాసింపజేశాడిందులో మహాకవి. అతడెప్పుడూ సింహాసనం మీద కూచొని రాజ్యమేలాలనే ఉబలాటం. పదిమందీ తనకు పాదాక్రాంతులు కావాలనే పాదాక్రాంతులైన ఆ సామంత రాజులెవరో కారు పాండవులే. జూదంలో తమ సర్వస్వాన్ని ఓడిపోయి చేతులు జోడించుకొని నిలబడ్డారు.

Page 231

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు