గోగ్రహణ వార్తరాగానే అంతా కలిసి కర్తవ్యాన్ని చర్చిస్తారు. దక్షిణయాత్రకు మిగతా వారంతా వెళ్ళినా ప్రధానమైన ఉత్తర యాత్ర కర్జును డొక్కడే వెళ్ళవలసి వచ్చింది. కౌరవ సైన్యమంతా అక్కడే సమావేశమై ఉంది. అందరి మీదా చేయిచేసుకొని ఒక్క సమ్మోహనాస్త్రంతో అందరినీ జయించాడు. ఇది తరువాత ఒక్క పాశుపతాస్త్రంతోనే అన్ని అక్షౌహిణులకు జవాబు చెప్పిన భారతయుద్ధాన్ని జ్ఞప్తికి తెస్తుంది. మరొక విషయం. భీష్మద్రోణులు దుర్యోధనుడికి తెలియకుండా పరస్సరం మంతనాలు చేయటం అర్జునుడి విషయంలో అభిమానం చూపటం చూస్తే ఇది కూడా జరగబోయే వృత్తాంతాన్ని మనసుకు తేకపోదు. పోతే భీముడు కీచకుణ్ణివాడి సోదరులైన ఉపకీచుకులతో పాటు అందరిని వధించటం చూస్తే రాబోయే కౌరవ సంహారం అంతా సూచితమవుతుంది. చీకటిలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా కీచకుణ్ణి తమ్ములను వధించటం మరొకవిధంగా చూస్తే సౌప్తిక పర్వంలో అశ్వత్థామ చీకటిలోనే పాండవ సైన్యాన్ని రహస్యంగా వధించిన వృత్తాంతాన్ని స్ఫురింపజేస్తుంది. పోతే సుదేష్టాదుల విలాపం స్త్రీ పర్వంలో స్త్రీల ఆక్రందననే బయట పెడుతున్న దృశ్యాన్ని చూపుతుంది.
అంతేకాదు. యుద్ధానంతరం విజయ సుఖం అందరూ అనుభవిస్తున్నా ధర్మరాజు దానికి విముఖత్వం వహిస్తాడు. సరిగా ఇక్కడ విరాటుడు సారె తీసుకొని కొట్టటం, దానితో రక్తం స్రవించి అతడు పరాఙ్మఖుడు కావటం, అందుకు సూచికా అనిపిస్తుంది. తరువాత ధర్మజుడు విరటుని సింహాసన మారోహించటం, తమ్ములు చుట్టూ నిలబడుట చూస్తే రాగల పట్టాభిషేక దృశ్యాన్ని బయట పెడుతుంది. అంతేకాదు. అభిమన్యుడికి ఉత్తరనిచ్చి వివాహం చేయటం కూడా సాభిప్రాయమే. వివాహఫలం సంతానమే గదా. వివాహితులైన ఇద్దరూ తీరిపోయి వారి సంతానమైన పరీక్షిత్తే చివరకు రాజ్యానికి వారసుడవుతాడని పాండవులంతా అతనికొప్పజెప్పి మహాప్రస్థానం చేరిపోతారనే సూచన కూడా ఇందులో ఉంది. ఇంకా ఒక రహస్యం కూడా గమనించవచ్చు. విరాటపర్వంలో ఎక్కడా కృష్ణుడుగాని, యాదవులుగాని కనపడరు. తరువాత ఉద్యోగ పర్వంలోనే రంగంలోకి వస్తారు. అంతకు ముందూ ఆ తరువాత కనిపిస్తారు. మధ్యలో ఒక్క విరాట పర్వంలోనే కనిపించరు. దీన్నిబట్టి పాండవ నిర్యాణానికి ముందే కృష్ణ యాదవ నిర్యాణ మవుతుందనే మౌసల పర్వ వృత్తాంతానికి కూడా ఇది వ్యంజకమే ననిపిస్తుంది.
Page 229