తిక్కనకున్న ఈ దృష్టి అంతా మనకు విరాట పర్వరచనలోనే కనిపిస్తుంది. ఆ పర్వాన్ని ఆయన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. దానిమీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉందా మహాకవికి. అసలు హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు, నానా రసాభ్యుదయోల్లాసి విరాట పర్వమని దాన్ని మాత్రమే గొప్పగా చెప్పటంలోనే మనకు దాని విశిష్టత నాయన సూచిస్తున్నాడు. తిక్కన భావించిన ఆ విశిష్టత ఏమిటని అడగవచ్చు. విరాట పర్వమనేది మహాభారత కథకంతటికీ కొలికి పూస, నాటకంలో పతాకా స్థానం లాంటిది., మొత్తం కథా వస్తువంతా అందులో బీజంలో మహావృక్షంలాగా నిక్షిప్తమయి ఉంది. ఇది ఒక విశేషం. మరి ఒక విశేషమేమంటే అంతకు ముందు జరిగిన కథాంశాలయితే నేమి, ఆ తరువాత జరగబోయేవైతేనేమి, అన్నీ అందులో చమత్కారంగా ధ్వనింపజేశాడు వేదవ్యాసుడు. వ్యాస మహర్షి నిర్మాణంలో ఇమిడి ఉన్న ఈ కళా రహస్యాన్ని ఎంతో సూక్ష్మంగా చూచి భేదించగలిగాడు మన కవిబ్రహ్మ. అందుకే ఆయన దానినంత వన్నెలు చిన్నెలు పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో వ్రాయవలసి వచ్చింది. ఈ రహస్యం తెలియకనే చాలామంది తెలిసీ తెలియని విమర్శకులు తిక్కన ఈ పర్వమొకటే ఒక ప్రబంధంగా ఎందుకు వ్రాశాడనీ ఇంతగా పెంచి వ్రాయటమనవసరమనీ ఒక పెద్ద ఇతిహాసంలో ఈ పర్వానికేమంత ప్రాధాన్యముందనీ లేనిపోని ఆక్షేపణలు చేస్తున్నారు. కాని లోతుకు దిగి పైన చెప్పిన రెండు రహస్యాలు పరామర్శించి చూచినవారికి కవి బ్రహ్మ సృష్టి ఎంత అవగాహనతో కూడినదా అని ఆశ్చర్యం కలిగించకపోదు.
విరాట పర్వంలోనే భారత కథ అంతా ఎలా కలిసి వస్తుందని అడగవచ్చు. భారతకథలో ఎన్ని సన్నివేశాలున్నవో ఎంతమంది పాత్రలున్నారో వారి పరస్పర వ్యవహారా లెలా జరిగినవో వాటన్నిటికీ పర్వమొక ప్రతిబింబం లాంటిది. దుర్యోధనుడి లాంటి వాడే కీచకుడు. వాడుకున్నట్టే వీడికీ నూరుగురు తమ్ములుండటం గమనించాలి మనం. వీరంతా విరాటుడి బలగం. విరాటుడంటే ఎవడోకాదు. ధృతరాష్ట్రుడే. వాడెంత అశక్తుడో వీడూ అంత అశక్తుడే. ఇరువురికీ ఇతరులంటే ఎంత గౌరవమున్నా స్వకీయుల మీద వ్యామోహ మంతకన్నా ప్రబలమై ప్రాణానికి ముప్పు తెచ్చింది. పాండవులు తండ్రిని కోల్పోయి ధృతరాష్ట్రుని పాలబడ్డట్టే తమ సర్వస్వాన్ని కోలుపోయి విరాటుడి పాల చేరారు. అక్కడ దుర్యోధనాదుల దుశ్చేష్టితాలకు గురయి ఏకచక్రపురంలో
Page 227