ఉంటుంది. పుత్రాది బంధంబుచే విడిపించుకొంటిని మంటినని యుండగా ప్రారబ్ధ
కర్మవశంబున మీ తగులం బొక్కటి ప్రాప్తంబయ్యె నంటుందొక కొంగ. ఇక్కడ కర్మ
వశంబున అంటే చాలు. కాని ప్రారబ్ధమనేది దానికి ముందు చేర్చాడు సూరి.
బంధవిముక్తుడైన తరువాత కర్మ ఎక్కడిదిక. సంచితమూ ఆగామీ పోయినా ప్రారబ్ధం
మాత్రముంటుందని అద్వైతుల సిద్ధాంతం. ఈ శాస్త్ర సంప్రదాయం మీదికి మన
దృష్టి మరలిస్తున్నాడా రెండు మాటలూ కలిపి వాడటంలో. కేవలం కర్మ అని వాడితే
ఈ స్వారస్యం పట్టుకోలేడు పాఠకుడని తెలుసు ఆయనకు. జలంబులు లేవని యాప్తుల
వలన విన్నాడ నంటుందొక ఎండ్రి ఆప్తవాక్యం శబ్దః అని శబ్ద ప్రమాణానికి లక్షణం
చెబుతారు నైయాయికులు. ఇక్కడ ఎండ్రకాయ విన్నదేగాని నీళ్లు లేవని కన్నదికాదు.
అలాంటప్పుడది ప్రమాణమెలా అవుతుందని ప్రశ్న. ఆప్తుల వలన విన్నాడ ననటంలో
ఆ ప్రామాణ్యాన్ని సూచిస్తున్నారు రచయిత. తత్త్వాన్ని స్వయంగా దర్శించిన వాడెవడో
వాడి కాప్తుడని పేరు. ఇది శాస్త్రంలో పారిభాషికమైన అర్థం. చూచినవాడు చెప్పిందిక
ప్రామాణిక మేగదా. ఇదీ ఇందులో ఉన్న గాంభీర్యం. ఆప్తుడని కాక మరోమాట
ప్రయోగిస్తే ఈ స్వారస్యం రాదు. ఇలాటి ప్రయోగాలెన్నో ఉన్నాయి అక్కడక్కడా
రత్నాలలాంటివి. మొట్టమొదట నేను మనవి చేసినట్టుగా కథా గమనం దగ్గరి
నుంచీ శబ్దప్రయోగం వరకూ రచనా వైచిత్రి నెంతగానో ప్రదర్శించారు పరవస్తువారు.
ఆప్రదర్శించటంలో కృత్రిమత లేదు సరిగదా మొత్తం కావ్య నిర్మాణాని కంతా
దోహదకారి. అలా కాకుంటే సమష్టికన్నా వ్యష్టి ప్రధానమై అది మొదలు చెడ్డ బేర
మవుతుంది. మనమే దృష్టితో చూచినా నిలిచే శిల్పమది. కాని పైపైన చూచి తల
ఎగరవేసేది మాత్రం కాదు. లోతుకు దిగి పుక్కిటి బంటిగా ఆస్వాదించవలసినది.
ఎద్దియేని సవిమర్శంబుగం బరికించినం గాని యున్న తెఱం గెఱుంగం బడదుగదా.
ఆయనగారన్న మాటే ఇది.
రచనలో పెద్ద మనిషి తరహా అనేది ఒక గొప్పలక్షణం. కొందరెంత గొప్పగా వ్రాస్తున్నా అక్కడక్కడ పలచని ప్రసంగాలూ మాటలూ దొర్లుతుంటాయి. వర్ణనలలో కూడా అశ్లీలత అసభ్యత గోచరిస్తుంటుంది. కథలో అలా ఉంది ఏమి చేస్తామని సమాధానం చెప్పుకోవచ్చు మనం. కాని లోటు లోటే. ఇది కాళిదాసాదులలోనూ ఉంది. పోతనలాంటి భక్తులలోనూ ఉంది. కాని చిన్నయసూరిలో మచ్చునకైనా కానరాదు. ఎక్కడైనా అనివార్యంగా చెప్పవలసి వచ్చినా దాన్ని తప్పించటమో లేక
Page 222