#


Index

చిత్రతరంగిణి

ఇంకా కావలసిన బంధువర్గం. అంతా కలిసి ఒక పంక్తిలో కూచోలేదు. వారందరూ తన మ్రోలన్ వసియింప మౌనిపతి చెంతన్ తాను కూచున్నాడట కృష్ణుడు. కుర్రకారంతా ఎదుటివరసలో కూచుంటే తామిద్దరూ పెద్దవారు గనుక ఒక పక్కన కూచున్నా రంటాడు కవి. ఎంత చక్కని ఔచిత్యం. భోజనం చేస్తున్నంతసేపూ పరిచారికలు వీవనలు వీస్తుంటే శాకపాకాదులను సారె గొనియాడుతూ కలహ భోజనుడితో పాటు మధుసూదనుడు వేడ్కతో ఆరగించాడట. అతడు కలహ భోజి, ఇతడు మధుసూదనుడు, భోజన విషయంలో ఎవరికెవరు తక్కువ.

  తరువాత నారదుడెక్కడ చేయి కడిగాడో చెప్పడు కవి. తాంబూల చర్వణం కూడా ప్రస్తావించడు. రసికుడైన కృష్ణుడు మాత్రం బాంధవ శ్రేణితో పాటు వామనేత్రా కరాంచలా వర్జ్య మాన గళిత గంధోదకములతో చేతులు గడిగి జాలవల్లికలతో తెచ్చి యిడిన కర్పూర తాంబూలాలు సేవిస్తాడు. ఇంతలో సత్యభామ అంతిపురమున ఉచిత కృత్యములు దీర్చిచంద్రశాలా స్థితుండైన శౌరి కడకు వచ్చి అక్కడే ఉన్న ఆ సంయమీంద్రుని అడుగులకు ప్రణమిల్లితే అతడామె ననేక విధాలదీవించి దనుజాంతక పోయి వచ్చెదను నను మరవకు మీ అని సెలవు తీసుకొంటాడు. ఎంత మనోహరమైనదో చూడండి ఈ గృహస్థ జీవిత వర్ణన.

  పుణ్యక వ్రతోత్సవాన్ని వర్ణించిన సందర్భమైతే ఇంకా వర్ణనాతీతం. నారదుడు కాదంటున్నా ఆయనను దాని ప్రతి గ్రహార్థం సతీపతులిద్దరూ కలిసి బ్రతిమాలి ఒప్పించారట. ఆ ఉత్సవానికి యదువృష్టి కుకురు భోజాంధ కాదులైన ఆప్తులూ, భీష్మకాదులైన సంబంధులూ, పాండవ కౌరవపాంచాలురాదిగా గలుగు బాంధవులూ, నందాది గోపాలురూ, నెయ్యురై వర్తించు నృపతులూ, అంతేగాక వారి వారల చుట్టముల్ వారి సఖులు అంతా హాజరయ్యారు. ఇక వారితో వారి సల్లాపాలూ ఎకసకాలూ ఇంతా అంతా గావు. బలి దనుజేంద్రు గట్టి తని పల్కగ విందుము గాని నేడు మా చెలియిదే పుష్ప దామకముచే నిను గట్టగగంటి మని సత్యభామ చెలులు కృష్ణుని మేల మాడుతుంటే ప్రక్కనే ఉన్న ధర్మజ భీమ ఫల్గునులు కనుసన్నలతో వారి నెసకొల్పుతూ నవ్వుతున్నారంటాడు కవి. ఎలాంటి వినోద కార్యక్రమమిది.

  అంతేగాదు. సత్య తనకు ధారాదత్తం చేసిన తరువాత నారదుడు కృష్ణుడికి పనులు పురమాయించే ఘట్టం సాహిత్యంలోనే మరపురాని ఒక మధురాతి మధురమైన

Page 211

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు