#


Index

చిత్రతరంగిణి

  ఎంత చమత్కారంగా ఉందో చూడండీ మాట. ఏమిటి దీని భావం. ఎంత వాడైన కన్యకు తన మీద మనసేనేది ఉందో లేదో గమనించకుండా పెద్దలెవరూ అనుమతించకుండా తొందరపడరాదు. నలుగురికి సమ్మతమయినప్పుడే అది శోభిస్తుంది. ఆ దాంపత్యమే సుఖమయ మవుతుందనే గదా. అందులోనూ ఏయే వేళలనే సరోజముఖి యేయే లీలలం గోరు, తానాయా వేళల నాసరోజముఖి నాయా లీలలం దేల్చి, యే చాయం జూచిన తానయై మెలగుచున్ అంటాడు. ఎంతమంది ఉన్నా ఎవరి మనసూ నొప్పించకుండా వారిలో వారికి మాత్సర్యం కలగకుండా అందరికీ అనుకూలంగా నడచుకోవటంలో చాతుర్యముండాలని సూచిస్తున్నాడు కవి.

  శ్రీకృష్ణుడికీ పదహారు వేలే గాక మరి ఒక ఎనమండుగురున్నారు. వారిలోనూ రుక్మిణీ సత్యభామలంటే ఆయనకు ప్రాణం. వారికందరి కంటే మిగులంగ చనువు లిచ్చేవాడట. ఇస్తే మిగతావారి కసూయ కలగలేదా. కలగదు. అందరలోన పెద్ద మహిమాన్విత అని వారు రుక్మిణిని గౌరవిస్తారు. అలాగే సతులట ప్రాణనాధులట సారెకు నైక్యములైన మోహసంగతులట, కల్పక క్షితి రుహమున్ నిజేశ్వరికి కృష్ణుడు తానిట దెచ్చెనని సత్యభామ అదృష్టాన్నీ మెచ్చుకొంటారు. ఎంత ఒద్దిక వారందరికీ.

  అయితే ఈ ఒద్దిక వారికిద్దరికే లేకపోయింది. లేకున్నా పెద్దది గనుక బయటపడదు రుక్మిణి. సత్యభామ ఎంత సాధిస్తున్నా తాను మాత్రం తొందరపడలేదు. కాని అది పైకి మాత్రమే. మాటల్లో కాకున్నా చేష్టల్లో రెచ్చగొడుతుందావిడ. అది సత్యభామకు తెలిసే ఆ రుక్మిణి నటనలని ఎత్తి పొడుస్తుంది. నటనగాకపోతే ఏమిటి. పెనిమిటి మొగమోటాని కొకవేళ పుష్పం చేతి కిచ్చాడే అనుకొండి. తిడితే గుద్దినట్టు వెంటనే ఆ పుష్పాన్ని కొప్పులో సవరించకపోతే నేమి. నారదుడు తన దగ్గర సత్యభామను తీసివేస్తుంటే అదేమిటి నారదా అలా అంటారు. నిష్కారణంగా మన మొకరిని గురించి అనుకోవటం దేనికని మందలిస్తే నేమి. అప్పటికి సవతిని తగ్గించి మాటాడితే అది తనకూ ఇష్టమనేగా అర్ధం. రుక్మిణికి మాత్యర్యం లేదని గాదు. ఉన్నా సత్యభామాలాగా బయటపడక లోలోపల వత్తులు మింగే స్వభావ మావిడది. చివరకు సత్య తన పంతం సాధించి పుణ్యకవ్రతానికి తన్ను ఆహ్వానించినప్పుడిక పోక తప్పదని పోయిందేగాని మనఃపూర్వకంగా పోలేదావిడ. అప్పటికీ మిగతా పదహారు వేల

Page 208

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు