#


Index

చిత్రతరంగిణి

రచనలో హాస్యం

  రచన అనేది రెండు విధాలు. భగవంతుడి రచన ఒకటి. మానవుడి రచన ఒకటి. భగవంతుడి రచన ఈ చరాచర ప్రపంచమే. పోతే మానవుడి రచన దానికి ప్రతి బింబమైన వాఙ్మయ ప్రపంచం. బింబలక్షణాలే ప్రతిబింబంలో కూడా ఉండటం కద్దు. బింబమైన భౌతిక ప్రపంచంలో మనకు కనిపించేవి మూడే లక్షణాలు. ఒకటి ప్రాణులూ - రెండు వారి జీవితం- మూడు తద్వారా వారికి కలిగే అనుభవాలు. ఇవి మూడే మనకు వాఙ్మయ జగత్తులో కూడా సాక్షాత్కరిస్తాయి. పేర్లలో మాత్రమే మార్పు. లోకంలో ప్రాణులయితే ఇక్కడ కనిపించేవి పాత్రలు. అది జీవితమైతే ఇది కథ. మరి వారికి కలిగే అనుభవాలే ఇక్కడ రసం. జీవితానికంతటికీ సారభూతమైనది సుఖదుఃఖాదుల అనుభవమే గదా. అంచేత సాహిత్యంలో కూడా అన్నిటికన్నా రసమే ప్రధానమై కూచుంది.

  ఈ రసాలను లెక్కగట్టి తొమ్మిది అని పరిగణించారు మన ప్రాచీనులు. తొమ్మిదేమిటి ఎన్నైనా ఉండవచ్చు. ప్రతిభావమూ ఆస్వాదయోగ్యమైతే అది రసమే. అందుకే మొదట్లో పరిగణించకపోయినా భక్తి వాత్సల్యమూ ధర్మమూ దయ ఇలాంటి భావవాలను కూడా తరువాత రసాల జాబితాలో చేర్చారు. కేవలం స్థూలంగా చేసిన విభజన మాత్రమే ఇది. అదైనా సత్త్వ రజస్తమోగుణాలనే త్రిగుణాలలో ఒక్కొక్కటీ త్రిగుణీకృతమైతే తొమ్మిదే అవుతాయి. కాబట్టి తొమ్మిది అని విభజించవలసి వచ్చింది. పోతే వీటిలో కొందరు శృంగారమే చాలు నంటే కొందరు వీరమంటే, కొందరు కరుణమంటే మరికొందరు అద్భుతరసానికే పట్టాభిషేకం చేస్తూ వచ్చారు. కాని అది చాలా సంకుచితమైన దృష్టి. పరిపూర్ణమైన ఆహారానికన్ని వ్యంజనాలూ కావలసినట్టే పూర్ణమైన రచనకు కూడా అన్ని హంగులు ఉండవలసిందే. ఏ ఒక్కటో ఉంటే సరిపోదు. అలాగైతే ఆ రచనకు సమగ్రత లేదు సరిగదా చాలా పేలవమనిపించుకొంటుంది.

  కనుకనే సమర్థుడైన రచయిత ప్రతి సాహిత్యంలోనూ తన రచనలో అన్ని రసభావాలనూ సందర్భోచితంగా పోషిస్తూ వచ్చాడు. అందులో మిగతావాటితోపాటు హాస్యానికి కూడా తగినంత స్థానం లభిస్తూనే ఉంది. హాస్యానికి స్థాయి భావం

Page 199

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు