పోతే నరకాసురుడి ఆగడాలతో ఆరంభమవుతుంది కథా వస్తువు. స్వర్గంలో ఆ దానవ సైన్యం చేసిన దుండగాలిన్ని అన్ని కావు. స్త్రీ జనాన్ని ఎంతగా బాధించారో కండ్లకు కట్టినట్టు వర్ణించాడు కవి. తుదకు ఊర్వశిలాంటి అప్సరసను బలవంతం చేయబోయినా అదీ మాట వినలేదు. మహమ్మదీయుల యుగమది సోమనాధుని యుగం హరిహర బుక్క రాయల రాజ్యకాలం గదా. అప్పుడప్పుడు హిందువుల రాజ్యంపై ముసల్మానులు సాగించిన దండయాత్రలూ, ఆ సందర్భంలో వారు హైందవ స్త్రీలనెలా బలాత్కరిస్తూ వచ్చారో ఆ దౌర్జన్యమూ, ఈ కథ వ్యాజంతో సూచిస్తున్నాడని తోస్తుంది. స్త్రీ రక్షే గాక గోరక్ష కూడా ముఖ్యం హైందవులకు. ఆ రెండింటికీ హాని చేయటమే హైందవేతరులకు వినోదం. ఇందులో నరకాసుర వృత్తాంతం మొదటి దానికి సూచకమైతే రెండవ దానికి ద్యోతకం చివరిదైన బాణాసుర ఘట్టం. బాణుడు గొప్ప శివభక్తుడే. అయినా అనిరుద్ధుడు కారణంగా కృష్ణుడితో జగడం తెచ్చుకొన్నాడు. శివకేశవులొకటేనని తెలియదా అవివేకికి. శివుడు బాసటగా ఉన్నట్టే నటించి నెమ్మదిగా తప్పించుకొన్నాడు సమయానికి. భక్తుడు మరీ దెబ్బతింటాడని తెలిసి కృష్ణుని బ్రతిమాలి వాణ్ణి చివరకు కాపాడుకొంటాడు. కాని వాడు వరుణుడి దగ్గర కాపుంచిన గోగణమలాగే ఉండిపోయింది. దానికి విముక్తి కల్పించే వరకూ కృష్ణమూర్తికి నిద్రపట్ట లేదు. వరుణుడి మీదికి దండెత్తిపోయి వాటిని కూడ బందీనుంచి విడుదల చేసి విజయోత్సాహంతో ద్వారకలో ప్రవేశిస్తాడు. దానితో కావ్యం సమాప్తి. స్త్రీ రక్షతో కావ్యారంభం, గోరక్షతో కావ్యసమాప్తి. స్త్రీ ఏమిటి - గో ఏమిటి. ఎందుకీ రెంటి మీదనే చూపుపెట్టాడు మహాకవి. ఏదో మర్మముంది ఇందులో. స్త్రీ పురుషుడికి సహధర్మచారిణి. స్త్రీ లేకుంటే ధర్మాచరణ లేదు. కనుక ధర్మ పురుషార్ధాని కది సంకేతం. పోతే గోవంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానమంటే మోక్షమే. మొత్తానికి ఇవి రెండు మనసులో పెట్టుకొని అర్థకామైన పరాయణమైన లోకానికి ఆముష్మికమైన ఆదర్శాలను రెండింటిని బోధిస్తున్నాడని తోస్తుంది సోమనాథుడు.
కాగా ఇలాంటి కావ్య సత్యాన్ని కథా రూపంగా ప్రతిపాదించటంలో ఎంత రచనా సౌందర్యాన్ని దానికి జోడించాడు ఆయన ఇక చెప్పనలని గాదు. సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, నీవన గుణసనాధ అని ఆయన స్వయంగానే చాటుకొన్న
Page 195