#


Index

చిత్రతరంగిణి

మధ్యమ వైఖరి అని నాలుగు మజిలీలలో సాగిందీ ప్రయాణం. పరారూపంగా అసలే కనిపించని ఆ శక్తి వైఖరీ రూపం ధరించే సరికెక్కడంటే అక్కడ దర్శనమిస్తుంది.

  అయితే శక్తి ఇలా అవతరించటంలో ఏమిటి అంతరార్థం. సంసార పంక నిర్నగ్న సముద్ధరణ పండితాఅని ఒక్కమాటలో బయటపెట్టింది లలితా సహస్రనామావళి. సంసారమనే అడుసులో కూరుకుపోయిన మనబోటి ప్రాణికోటిని లేవనెత్తి మోక్షమనే ఒడ్డున పడవేసే ప్రయత్నమే అది. అవిద్యాకామ కర్మలనే కాలుష్యం మనలో ఉన్నంత వరకూ అది సాధ్యం కాదు. అసుర సంపద అది. మోక్షమార్గానికది ఎప్పుడూ అడ్డు తగులుతుంటుంది. దాని అడ్డు తొలగాలంటే శమదమాదులూ, శ్రవణ మననాదులనే దైవసంపద మన కలవడాలి. అది ఆ మహాశక్తి అనుగ్రహముంటే గాని సంభవం కాదు. ఆవిడ తిరోధానానికి గురి అయి ఇందులో వచ్చిపడ్డాము. దానికి కారణం మనలో చోటుచేసుకొన్న మహిషాసురుడే. అజ్ఞానమే మహిషాసురుడు. అసుర సంపదకంతా వాడే మూల పురుషుడు. వాణ్ణి సంహరిస్తే ఇక శుంభనిశుంభులు పారిపాటికి వారే రూపమాసిపోగలరు. రాగద్వేషాదులైన ద్వంద్వాలే శుంభనిశుంభులు. ఇలాంటి దుష్టశక్తులను శిక్షించి శిష్టమైన దైవశక్తిని మనకు సురక్షితం చేసి మోక్షమార్గాన్ని చూపటానికే మహాశక్తి అవతరణం. సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ అనటఁ లో ఆ దుష్టశిక్షణా తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ అనటంలో ఈ శిష్ట రక్షణా వ్యంగ్యంగా సూచిస్తున్నాడు మనకు మహాకవి.

  అమ్మవారి నవరాత్రోత్సవాలు ప్రతియేటా మనం జరుపుకొంటున్నామంటే ఎంతైనా ఉంది అందులో ఆంతర్యం. అష్టమినాడు దుర్గాదేవి అష్టభుజాలతో శూలచక్ర శంఖాదులైన అష్టాయుధాలు ధరించి, నవమినాడు నవద్వారాలను దాటించి, దశమినాడు మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రాలే నవద్వారాలు. పృధి వ్యాది పంచ భూతాలూ, మనోబుద్ధ్య హంకారాలూ, వీటికి కర్తృత్వం వహించే జీవుడూ వెరసి నవద్వారాలివి. ద్వారమనేది లోపలికి రావటానికీ పనికివస్తుంది. వెలుపలికి పోవటానికీ పనిచేస్తుంది. తమోమయ మయితే ఇవి రాత్రులయి చీకట్లోనే పడదోస్తాయి. తమస్సు మనకనాది సిద్ధమైన అజ్ఞానమే. అదే తొమ్మిదిరూపాలుగా వచ్చి నెత్తిన పడింది కాబట్టి నవరాత్రాలనేవి ఇవే. అవే సంసారంలో పడదోసే

Page 191

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు