#


Index

చిత్రతరంగిణి

గుడ్లప్పగించి చూడవలసిందే గాని ఇది ఏమిటి ఎలాగని ఊహించలేము. మరి ఇలాంటి ఐంద్ర జాలికులను కోటాన కోట్లను సృష్టించిన ఆ మహాశక్తి నేమని వర్ణించగలం. అన్నింటికీ అతీతమైనది మూల భూతమైనదీ ఆశక్తి. పరాశక్తి ఆదిశక్తి అని కూడా అందుకే వర్ణించారు దాన్ని.

  పరాశక్తి గనుకనే అది ఏకం. ఏకైకమైన అమహాశక్తే ఈ జీవ జగత్తులను సృష్టించవలసి సరస్వతి అయింది. పోషించవలసి లక్ష్మి అయింది. ఉపసంహరించవలసి పార్వతి అయింది. ముగురమ్మలు వీరే సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు. వీరికి మూల భూతమైన ఏకైక శక్తి ఆ పరాశక్తే గనుక అది ఈ ముగురమ్మలకు మూలపుటమ్మ అయింది. ఆ శక్తి ధరించిన భూమికలే ఈ ముగురమ్మలు. సృష్టి స్థితిలయాలనే మూడుకార్యాలనూ నిర్వహించటానికి ధరించిన మూడు భూమికలివి.

  అదేమిటి. పరమాత్మ గదా సృష్టి, స్థితిలయాలు చేస్తాడని వర్ణించాయి పురాణాలు. బ్రహ్మ సృష్టిస్తాడని, విష్ణువు పాలిస్తాడని, రుద్రుడు సంహరిస్తాడని వింటున్నాము గదా. వాస్తవమే. కాని వారు స్వయంగా తమపాటికి తాము చేయలేరా పనులు. తమతమ శక్తులనాధారం చేసుకొనే సాగించాలి. త్రిమూర్తుల తాలూకు ఆ శక్తులే సరస్వతీ లక్ష్మీపార్వతులు. వారు చైతన్య రూపులయి వీరిని భరిస్తారు. కాబట్టి వారికే భార్యలయినారు. సృష్టి శక్తి ఒకరిది, స్థితిశక్తి ఒకరిది, లయ శక్తి ఒకరిది. కేవలశక్తీ చేయలేదొక పని. కేవల చైతన్యమూ చేయలేదు. చైతన్యం నిరాకారం గనుక చేయలేదు. శక్తి జడం గనుక చేయలేదు. జడమైన శక్తి చైతన్య సహకారంతో సాగిస్తున్నదీ కలాపమంతా. మయాధ్యక్షణ ప్రకృతి స్సూయతే సచరాచరమని భగవద్గీత చాటటంలో ఇదే అంతరార్థం.

  త్రిగుణాత్మకమైన ఈ మూల ప్రకృతే ముగురమ్మల మూలపుటమ్మ, సగుణమైన ఈ శక్తి నిర్గుణమైన పరమాత్మను నిత్యమూ ఆశ్రయించి ఉంటుంది. అప్పుడు దీని గుణాలు బయటపడవు. అవ్యక్తంగా పరమాత్మ చైతన్యంతో ఏకమై ఉంటాయి. సృష్టి చేయాలనే సంకల్పమాయన కెప్పుడు కలిగిందో అప్పుడిది సగుణంగా ప్రసరించింది. అఖండమైన జ్ఞానం క్రియారూపంగా బయటపడటమే ప్రసరణం. పరా పశ్యంతి

Page 190

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు