సత్యలోకాన్ని చేరి అక్కడి నుంచి క్రమంగా నిర్గుణ బ్రహ్మ తత్త్వాన్ని అందుకొంటారు. వారికి పునరావృత్తి భయం లేదని హామీ ఇస్తున్నది గీత.
మరి దక్షిణాయనంలో కన్ను మూసిన వారి సంగతేమని అడిగితే దానికిలా సమాధానమిస్తున్నది. ధూమో రాత్రిస్తధా కృష్ణః - షణ్మాసా దక్షిణాయనమ్ - తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే. దక్షిణాయనమంటే అది ధూమమార్గం. జ్యోతిర్మార్గం కాదు. శుక్లం కాదది కృష్ణం. రాత్రి చీకట్లో వెళ్లినట్టు వెళ్లవలసి ఉంటుంది వారి ప్రయాణం - ప్రయాణం చేసి కర్మిష్ఠులందుకొనేది చంద్రలోకమేగాని, దేవలోకాలు గావు. అలా అందుకొన్నా సుఖం లేదు. కర్మఫలమనుభవించి మరలా కర్మశేషంతో తిరిగి ఈ కర్మభూమిలో వచ్చిపడ్డవలసిందే. ఇంతెందుకు శుక్లకృష్ణ గతీ హ్యేతే - ఈ శుక్ల కృష్ణ మార్గాలు రెండూ జగత శ్శాశ్వతీ మతే. ఉపాసకులకూ కర్మిష్ఠులకూ ఇద్దరికీ వర్తిస్తాయి. ఏకయా యాత్యనా వృత్తి మన్యయా వర్తతే పునః వీటిలో ఒకటి అనావృత్తికైతే మరొకటి ఆవృత్తికి దారి తీసే బాపతని చాటుతున్నది శాస్త్రం.
అటు లోకులూ ఇటు శాస్త్రమూ రెండూ కలిసి ఏక కంఠంతో చాటి చెబుతున్నాయంటే ఇందులో ఏదో గొప్ప రహస్యమిమిడి ఉండాలి. సందేహం లేదు. లోక సామాన్యంగా చూచినా ఉత్తరాయణం నిజంగా ఉత్తమమే. ఎందుకంటే పంట చేతికి వచ్చేది మకర సంక్రాంతికే. మరి లక్ష్మి తాండవిస్తుంది మనలోగిట. ఆహారముంటేనే గదా ఏదైనా. అంటే శరీర మాద్యమఖలు ధర్మసాధనమన్నారు. ఆహారమే గాక ఆరోగ్యం కూడా ఉండాలి మానవులకు. అది కూడా అప్పుడే చక్కబడుతుంది మనకు. అంతకు ముందు దక్షణాయన మంతా వర్షాలూ, చలీ ఎక్కువ కాబట్టి రోగాలకు నిలయమది. సూర్యుడికి భూమి దూరంగా పోతుంది కాబట్టి ఆయన వేడికీ వెలుగుకూ ఎక్కువగా నోచుకోదు ప్రాణికోటి. వేడీ వెలుగే జీవ లక్షణమసలు. దానికి భిన్నంగా శైత్యమే జడలక్షణం. మన శరీరంలో లోపలా వెలపలా తేజస్సుండాలి. రెండూ చల్లబడితే అదే మరణం. వేడి ఉన్నంత వరకే జీవితం. జీవుడికి తైజసుడని అందుకే పేరు. ఈ తేజస్సు లోపల ఉన్నా వెలపల ఉన్నా అంతా సూర్యతేజః ప్రసాదమే. సూర్యుడికి జగత్రాణుడని జగచ్చక్షువని మిత్రుడని లోక బాంధవుడనీ పేరు పెట్టారంటే ఎంతో అర్థముంది అమాటల్లో. సూర్యరశ్మి
Page 188