చేయాలి. చేస్తే అది ఈ భౌతికమైన క్షేత్రం నుంచి తప్పించి మనల నాధ్యాత్మికమైన క్షేత్రంలోకి చేర్చగలదు. అందుకే ఈ నవరాత్రాలలో వివిధభంగిమలలో ఈ దేవీ ఉపాసన.
12. అయితే ఇది సాధకుడు శమదమాది దైవగుణ సంపన్నుడయి సాగించాలి ఈ ఉపాసన. అలా సాగిస్తేనే అభీష్ట ఫలాన్ని ప్రసాదిస్తుంది. దీనికే సమయాచారమని పేరు. సమయమన్నా సమాపత్తి అన్నా పరతత్త్వంతో తాదాత్మ్యాన్ని భావించటమని అర్థం. ఇదే సరియైనమార్గం. అలాకాక అసుర సంపద వదలకుండా సాగిస్తే అది సమయ కాదు. వామాచారమంటారుదాన్ని. అది సరియైన ఫలితమివ్వకపోగా ఎక్కడ లేని అనర్ధాన్ని తెచ్చి పెడుతుంది. ఈ భావానికి ద్యోతకంగా చెప్పినవే పురాణంలో మహిషాసురాదుల కథలన్నీ. మహిషారుడెవరో కాదు మనలో అనాదిగా పేరుకొన్న అవిద్యా తమస్సే. అది దగ్గర పెట్టుకొనే ఆ దివ్యశక్తినధీనం చేసుకోవాలంటే సాధ్యంకాదు. దాన్ని సమూలంగా మర్దిస్తేనే అది మనకు దక్కేది. మర్దించాలంటే ఆవిడ అనుగ్రహం కావాలి. నిరంతరాభ్యాసం మూలంగా మనలో ఉన్న ఆ మహిషాసురుణ్ణి ఆవిడే మర్దించి మన దృష్టిని పరిశుద్ధం చేయగలదు. మరి రాగద్వేషాది ద్వంద్వాలున్నంత వరకూ అజ్ఞానం బలమవుతుందేగాని తొలిగిపోదు. చెడ్డమీద రాగం, మంచి మీద ద్వేషం. ఇవే శుంభ నిశుంభులు మనపాలిటికి. ఇవి మాయాశక్తి వర ప్రభావం వల్ల బలం పుంజుకొని బహుజన్మల నుంచీ బాధిస్తున్నవి. వీటిని కూడా నివారించటాని కాదేవి అనుగ్రహమే కావాలి. దైవ సంపదతో ఆరాధిస్తే ఈ ద్వంద్వాలను కూడా నిర్మూలించి నిర్ద్వంద్వమైన మోక్ష సుఖాన్ని కందిస్తుంది. మృత్యోర్మా అమృతం గమయ. అదే మర్త్యత్యాన్ని వదలి అమర్త్యమైన పదవినందుకొనే మార్గం. రాత్రులలాంటి నవావరణలనూ దాటి జీవితంలో విజయాన్ని సాధించగలడు మానవుడు. అదే అసలైన విజయదశమి మానవజీవితానికి.
Page 165