నిశ్చయాత్మకమైన బుద్ధే. అందులో ఆవిడ పరమశివునితో ఏకత్వాన్ని భజించటం బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మస్వరూపంతో తాదాత్మ్యం చెందటమే. ఇలా దర్శిస్తూ పోవాలి సాధకుడు. అహ మిత్యేవ విభావయే భవానీ మన్నారు. ఉపాసన అంటే ఉపాస్య దేవతను మన కనన్యంగా భావించటమే.
11. పోతే ఇక కుండలినీ యోగం. చిచ్ఛక్తి బాహ్యమైన ప్రపంచంగానేగాక
శరీరంగా కూడా పరిణమించింది గదా. పరిణమించి తన స్థూల రూపంలో మరలా
సూక్ష్మమైన రూపంలో ప్రవేశించింది. ఒక వల్మీకంలో సర్పంలాగా ప్రాకుతూ వచ్చి
ఇందులో తలక్రిందులుగా సంక్రమించింది. చుట్టచుట్టుకొని శయనించింది. అందుకే
కుండలిని అన్నారు దాన్ని. అదే అవిద్యా రూపమైన నిద్రావస్థ. దానిని మరలా
ప్రబోధిస్తేగాని ముక్తి లేదు మానవుడికి. అది ఎలాగ. మూలాధారం నుంచి విశుద్ధం
వరకూ ఉన్న అయిదు చక్రాలనూ వరుసగా దాటించాలా శక్తిని. అవి అయిదూ
పంచభూతాలకు సంకేతాలే. విశుద్ధం దాటే సరికది భౌతికమైన పరిధి నతిక్రమిస్తుంది.
తరువాత వస్తుంది భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రం. అంతవరకూ భౌతికమైతే ఇది
శాక్తేయం. వ్యక్తమైన జగత్తుశక్తిగా మారాలని అర్థం. అదీ దాటితే సహస్రారం. ఇది
శాంభవమైన స్థానం. అచేతనమైన ఆశక్తిని కూడా శుద్ధ చైతన్యరూపమైన శివతత్త్వంతో
ఏకంగా భావించాలని తాత్పర్యం. ఇందులో మొదటి రెండూ బ్రహ్మగ్రంధి అనీ,
రెండవ జంట విష్ణుగ్రంధి అనీ, మూడవ జత రుద్రగ్రంధి అనీ పేర్కొంటారు. గ్రంధి
అంటే ముడి. ఇవి ఏవో కావు. రజస్సూ, సత్వమూ, తమస్సూ. సృష్టిస్థితి లయాలకు
ప్రతీకలు. ఈ గ్రంధిత్రయాన్ని భేదించటమంటే త్రిగుణాలను దాటి పోవటమనే
భావం. గుణాత్మకమైనది భౌతికం. గుణ సామ్యం శక్తి. గుణాతీతం శివం.
మూడింటిలో మొదటి దానికి అధి దేవత గణపతి, రెండవదానికి శక్తి, మూడవదాని
కీశ్వరుడు అధి దేవతలు. మూడవది గమ్యం జీవితానికి. అది చేరాలంటే మొదట
గణపతిని, తరువాత దేవిని ప్రసన్నులను చేసుకోవాలి. అందుకే సంవత్సరంలో
మొదట వినాయ చతుర్థి, తరువాత దేవి నవరాత్రాలు ఆ తరువాత శివరాత్రి వరుసగా
రావటం. రాత్రి అయినా జాగరణ చేస్తాము కాబట్టి యానిశా సర్వభూతానా మన్నట్టు
నిత్యప్రకాశశీలమైన స్వరూపస్థితి అది. అది అందుకోవాలంటే భూతగణాలడ్డు
పడుతున్నాయి సాధకుడికి. వాటి బారి తప్పించుకోవాలంటే ఆ దేవి నుపాసన
Page 164