#


Index

చిత్రతరంగిణి

పరిపూర్ణమైన నీ ఆత్మచైతన్యమే ఎక్కడ చూచినా ఏదిచూచినా నీకు నీవే దర్శన మిస్తుంటావని చాటుతున్నది ముండకోపనిషత్తు అప్పుడిక జాగ్రత్స్వప్న సుషుప్తులని మూడవస్థలు గాక అంతా కలిసి ఒకే ఒక తురీయావస్థ గానే మారి గోచరిస్తుంది. ద్రష్టా దృశ్యమనే భేదం కూడా నశిస్తుందని మాండూక్యం చెప్పేమాట. అయితే అదే అఖరు మాట అయినా దేహాత్మాభిమాన మున్నంత వరకూ ఒక్కసారిగా అది అనుభవానికి రావటం కష్ట సాధ్యం. కనుక అన్న మయాది పంచ కోశాలను ఒక్కొక్క పొరలాగా విప్పుకోంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరకి కోశాలన్నీ నాకు వేరుగావు - నాస్వరూపమేనని ఉపాధులను కూడా చైతన్యంలో కలుపుకొని చూస్తే సమకూరుతుం దంటుంది తైత్తిరీయోపనిషత్తు. ఆత్మనెప్పుడు గాని వ్యష్టిగా కాక సమష్టిగా చూడటం నేర్చుకోవాలి. దృష్టిని సమష్టి మీదికి మళ్లించటానికే ఈ జీవజగ ద్రూపమైన సృష్టినంతా ఒక సంకేతంగా వర్ణించింది శాస్త్రమని శాస్త్రరహస్యం విప్పి చెబుతుంది ఐతరేయం అది గ్రహిస్తే అప్పుడు త్వం పదార్థమైన నీవు లేవు. సమష్టి రూపమైన తత్పదార్థమే నీవని తత్వమసి సూత్రంతో బయట పెడుతుంది ఛాందోగ్యం.. పోతే అది గట్టి చేసుకోంటే నాలు నీవిక చేయవలసిన అభ్యాసం భాహ్యంగా ఏదీలేదని ఉపదేశిస్తుంది అహం బ్రహ్మాస్ని అనే సిద్ధాంతం ద్వారా ఆఖరిదైన బృహదారణ్యకం.

  ఇంతకూ ఏ ఉపనిషత్తు ఎలా బోధించిన సారాంశమొకటే అది ఈ అనేకత్వంలో నుంచి మన బుద్ధినేకత్వం వైపు మళ్లించటమే. అనేక మనేది నిజాని కేకత్వం నుంచి వచ్చిందే. ఆ ఏకత్వ మేక్కడో లేదు. ఈ అనేకత్వంలోనే ఉంది మరలా. కాని అది మనకీ అనేకత్వం మీదనే దృష్టి ఉన్నంతవరకూ కనబడదు. ఆభరణాలలో బంగారం లాగా మరుగుపడి ఉంటుంది. దాని మూలంగా జీవుడూ జగత్తూ - ఈశ్వరుడూ వేరయిపోయి అన్ని సమస్యలకు అది దారితీస్తున్నది. ఇదీ సంసార బంధం. ఇది పరిష్కారం కావాలంటే మరలా అనేకత్వంలో దాగి ఉన్న ఆ ఏకైకమైన ఆత్మతత్త్వం మీద చూపు నిలిపి ఆ చూపుతో ఈ ఆనాత్మ ప్రపంచాన్ని దర్శించాలి. దర్శిస్తే అప్పుడీ నామరూపాత్మకమైన జగత్తంతా చైతన్యంలో కలిసి సృష్టి అంతా మన స్వరూపంగానే అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఆ అనుభవంలో ఇక జీవ జగదశ్వీరులనే భేదమూ లేదు. తన్నిమిత్తమైన సమస్యాలేదు. మానవుడి విజ్ఞానానికి అనుభవానికి రెంటికి పరిపూర్ణత అది.

Page 147

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు