#


Index

చిత్రతరంగిణి

  ఉపనిషత్తులనేవి ఒకటిగాదు. పదకొండు వందల ఎనిమిదున్నాయి. ఉపనిషత్తులు. నాలుగు వేదాలకూ కలిపి అన్ని శాఖలున్నాయి. ప్రతి శాఖ అంతంలో ఒక ఉపనిషత్తు వస్తుంది. అంతంలో వస్తుంది కాబట్టి వేదాంతమని పేరు వచ్చిం దుపనిషత్తుకు. అవి పదకొండు వందల ఎనిమిదయితే అందులో నూట ఎనిమిది చాలా ప్రశస్తం. శ్రీరాముడు హనుమంతుడి కానూటఎనిమిదీ బోధ చేశాడు. అందులోనూ పది ఉపనిషత్తులు సారభూతమైన వన్నారు. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి: ఐతరేయంచ ఛాందోగ్యం బృహదాణ్య మేవచ - అని వాటిని మన ప్రాచీసులు వర్ణించి చెప్పారు. ఈ అనాత్మ జగత్తంతా వట్టి అభాసే. వస్తువు కేవలమా ఈశ్వర చైతన్యమే. లాబట్టి ఆ ఈశ్వర భావనతో దీన్ని దర్శించండి. తన్మయంగానే కనిపిస్తుంది. తేన త్యక్తేన మంజిల్లా నామరూపాత్మకంగా వదలేసి సచ్చిడ్రూపంగా పట్టుకోటమే మనం చేయవలసిన సాదన. సర్వము ఆత్మగా దర్శించి నపుడు కోమోహ. కళ్మోరు - వికత్వమును విశ్యతః- అసలు ఏకత్వ భావనలో ఇక శోక మేముంది. మోహ మేముందని ఈశావాస్యం చాటుతుంది. ఎక్కడున్నాడా ఈశ్వరుడంటే ప్రాణస్య ప్రాణమ్ మనసో మనోయత్- మన ప్రాణ చలనమూ మనశ్చలనమూ ఈ చలనాలే అచలం నుంచి ఏర్పడుతున్నచో ఆ అచలమైన చైతన్య మొకటి ఉండాలి గదా. అది వ్యక్తమూ గాదు. అవ్యక్తమూ గాదు. రెంటికి విలక్షణ ప్రతిబోధ విదితం, దానిని ప్రతి ఆలోచనకూ ఆధార పీఠమనే భావనతో పట్టుకోవాలని కేనోపనిషత్తు సలహా. అందుకోసం ఉత్తిష్టత జాగ్రత ప్రాప్యవరాన్ని బోధత - లేచివెళ్లి పెద్దల నాశ్రయించండి. అనన్య ప్రోక్తేగతి రత్ర నాస్తి. ఆత్మ తత్త్వాన్ని దర్శించిన వారు కాబట్టి వారు నీకు ఆ అనుభవం ప్రసాదించగలరని చెబుతుంది కఠోపనిషత్తు. అది ఎలా ప్రసాదిస్తారా అనుభవమని అడిగితే నామాది ప్రాణాంతంగా షోడశ కళాత్మకమైన ఈ సృష్టి అంతా నిష్కలమైన ఆ పురుష తత్త్వం సుంచే వచ్చింది. కాబట్టి యధా నద్య స్స్యందమానా స్సముద్రే - తథా కలాః పురుషం ప్రాప్యాస్తం గచ్చంతి. గంగా యమునాది నదలన్ని సముద్రంలో కలసి నామరూపాలు ఎలా వదిలేస్తాయో అలాగే ఇవన్ని పురుషచైతన్యమేనని భావిస్తే నామరూపాలన్ని చైతన్యంతోనే లీనమై అది ఆత్మగానే మనకు ఏకంగా సాక్షాత్కారిస్తుంది. ఈ ప్రవిలాపనమే సాధన అని బోధిస్తుంది ప్రశ్నోపనిషత్తు. ఆ ఏకాత్మాను భవమెలా ఉంటుందని అడిగితే బ్రహ్మ పశ్చాద్రహ్మ పురస్తాత్ బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్ఠం - నీవూ నీవు చూచే ఈ ప్రపంచమూ అంతా బ్రహ్మ స్వరూపమే అది

Page 146

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు