#


Index

చిత్రతరంగిణి

భావించే ఈశ్వరుడు. ఈ మూడు మూడుగా గాక ఒకే ఒక ఆత్మచైతన్యంగా భాసించిందట. ఆ చైతన్యమే ఇన్ని రూపాలుగా మారి భాసిస్తున్నదని తెలుసుకొన్నారట చివరకు.

  ఇదీ శ్వేతాశ్వతరమనే ఉపనిషత్తు మనకు బోధించిన ఒకానొక రహస్యం అదేగాదు. అన్ని ఉపనిషత్తులు కూడా చెప్పే రహస్యమిదే. మానవ విజ్ఞానాని కంతటికి భాండాగారం లాంటిది వేదమైతే ఆ వేదానికి పర్యవసాన ముపనిషత్తు. అది మానవుడి అనుభవాన్ని అంతా విశ్లేషించి దానికొక తిరుగు లేని పరిష్కారం చేసి చూపింది. మన అనుభవంలో ఉన్న అంశాలు మూడే. ఒకటి మనకు నిత్యమూ కనిపించే ఈ ప్రపంచం. రెండు దీనికతీతంగా కనిపించకుండా ఎక్కడో ఉందని భావించే ఈశ్వరుడు. మూడు ఈ రెండు కొసలతో సంబంధం పెట్టుకొని బ్రతికే మనం. జీవజగదీశ్వరులనే ఈ మూడింటికీ తత్త్వత్రయమని పేరు. ఏకాలంలో ఏ మేధావంతు డ్రాలోచించినా ఈ మూడింటిని గురించే ఆలోచించవలసింది. ఇంతకు మించి నాలుగవదంటూ లేదు మనమాలోచించవలసిన పదార్థం. ఇందులో ఆలోచించి పరిష్కరించుకోవలసిన వాడటు ఈశ్వరుడూ కాడు. ఇటు జగత్తు గాదు. జగత్తు కేవల జడ పదార్థం. ఈశ్వరుడు పరిపూర్ణ చైతన్యం. కాబట్టి ఇరువురికీ లేదా అవసరం. పోతే అచేతనం కాక చేతనమైనా పరిపూర్ణాంకాని మనబోటి జీవుడికే ఈ సమస్య. మనమే పరిష్కరించుకోవాలి. మనలోనే బాగా ఎత్తులకెదిగి చూడగలవాడెవడో వాడే ఋషి. వాడు దర్శించి మరలా మనకు శబ్దరూపంగా వెల్లడించిన అనుభవాలే ఉపనిషత్తులంటే.

  ఏమిటి వారు దర్శించి చాటిన ఆ సత్యమంటే జగత్తు జీవుడూ ఈశ్వరుడు అని మూడు కావు వాస్తవంలో. వాస్తవంలో ఉన్నదొకే ఒకతత్త్వం అది సర్వవ్యాపకమైన పరిపూర్ణమైన చైతన్యం. చైతన్యం గనుక అది స్వతసిద్ధం. స్వతస్సిద్ధం గనుక ఆత్మస్వరూపం. మరి ఈ అనాత్మ ప్రపంచమే దోగాదు. దాని ఆభాసే. అంటే అదే ఈ రూపంలో ఇలా భాసిస్తున్నదని అర్థం. ఒక సువర్ణమే ఆభరణాల రూపంలో భాసించటం లేదా. అలాగే కాగా ఈ ఆభాసనే చూచి వస్తువును మరచిపోయిన చైతన్య భాగమేదో అది జీవుడు. మరవకుండా చూస్తున్న చైతన్య మీశ్వరుడు. ఇవి మూడు కలసి ఆత్మచైతన్య విభూతేనను కొన్నవాడికిక ఏ సమస్యాలేదు. వాడు ముక్తుడు. అలా అనుకోలేనంత వరకూ అన్ని సమస్యలు ఉన్నాయి. వాడు బద్ధుడు. అనుకోటమే జ్ఞానం. అనుకోకపోవటమే అజ్ఞానం. ఆత్మజ్ఞానం మనకందించి అనాత్మ భావంనుంచి మనకు మోక్షం ప్రసాదించటానికే ఉపనిష ద్వాఙ్మయమంతా అవతరించిందసలు.

Page 145

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు