మార్కండేయుడు అజరామరుడయి యుగయుగాలు బ్రతుకుతూ వచ్చాడని వర్ణించంటలో కూడా ఆధ్యాత్మికమైన రహస్యమిదే.
రాత్రిలాంటిది మరణమైతే అహస్సులాంటి దమృతత్త్వం. పరిశుద్ధమైన చైతన్య ప్రకాశమే అహస్సు. అందులో మెలకువ గలిగి ఉండటమే మనం చేయవలసిన జాగరణ. అలా చేస్తూపోతే అది అశివమైన మర్త్య భూమిని దాటించి శివమైన అమృతత్త్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ దృష్టితో మరలా ఈ మృతమైన సృష్టిని దర్శించామంటే ఇది కూడా అమృతమైన శివ స్వరూపంగానే భాసిస్తుంది. అదే శివరాత్రినాడు మనం చేసే లింగాభిషేకం. ఏకాదశ రుద్రం పఠిస్తూ ఏకధారగా సాగిస్తామీ అభిషేకం. ఏకాదశ ఏమిటి. రుద్రమేమిటి. రుద్ర అంటే రోదనం చేసేది. చలించేదని అర్థం చలించేవి మన శరీరంలో పదకొండే ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు. పంచకర్మేంద్రియలు. అంతరింద్రియమైన మనస్పూ, ఇవే ఏకాదశ రుద్రులంటే. వీటినిమంత్రశక్తితో నిరోధించి శివతత్త్వం దగ్గరనిలపాలి మనం. అదే ఉపవాసం. దగ్గర వసించటమని అర్థం. అలా వసిస్తే ఆ శివచైతన్యమనే అమృతధార ఈ ఏకదశ సంఖ్యాత్మకమైన సృష్టినంతా అభిషేకిస్తుంది. అభిషేకించి సృష్టిని కూడా దృష్టిగా మార్చి చూపుతుంది. అప్పుడేదీ మృతం కాదు. అంతా అమృతమే. ఏదీ అశివంకాదు అంతా శివమే.
ఓం నమశ్శివాయ
Page 143