ఉండలేదా శక్తి. దానిక్రాశయ మిచ్చేది శుద్ధమైన చైతన్యం. అది మన స్వరూపమే గనుక అశివంకాదది శివం. శిరస్సులో ఉండే సహస్రారం దానికి స్థానం. దీనినే పురాణాలలో కైలాసమని వర్ణిస్తారు. అక్కడ శివశక్తులు రెండూ అవినాభావంగా కలిసి ఉంటాయి. అర్ధనారీశ్వరమని మన పురాణాలు వర్ణించిన సంకేతమిదే. అక్కడికిక సాధకుడి యాత్ర సమాప్తం. బాహ్యజగత్తులో మనం జరుపుకొనే పండగలు చూచినా ఈ భూమికా క్రమాన్నే మనకు జ్ఞాపకం చేస్తాయి చూడండి. ప్రతి సంవత్సరమూ మొదట గణపతి నవరాత్రులు జరుపుకొంటాము. తరువాత దేవీనవరాత్రులు జరుపుతాము. ఆ తరువాత వస్తుంది శివరాత్రి అనేది. అప్పటికీ భౌతికమైన జగత్ సృష్టినీ అభౌతికమైన శక్తిని దాటిచూడాలి మన మా శివతత్త్వాన్ని అని చెప్పటమే గదా ఇది.
అలా దాటి చూచినప్పుడే నిజమైన అమరత్వం, అంత వరకూ మర్యుడైతే అప్పటి నుంచీ అమర్యుడవుతాడు మానవుడు. ఈ భావాన్ని సూచించటానికే మార్కండేయుడి కథ మన పురాణాల్లో, పదాహారేండ్లు రాగానే మరణిస్తాడని శాపం మార్కండేయుడికి మార్కండేయుడంటే ఎవరోగాదు. మానవుడే. పదహారు కళలే పదహారేండ్లు. ప్రాణం మొదలు నామం వరకూ ఈ షోడశ కళలతోనే జన్మించాము మనం. షోడశకల: పురుషః అని చాటుతున్న దుపనిషత్తు. ఇవి మరలా లయమై పోవటమే మరణం మనకు. కాలమే మనలను చంపుతున్నది. కాలమే యముడు. యమించుట మంటే బంధించటం. అలా బంధించేది మనలను కాలమే గనుక ఇదే యముడు. దీని పాశంలో చిక్కుపడ్డాడు జీవి. మరలా దీనిలో నుంచి బయటపడాలంటే శివలింగాన్ని గట్టిగా వాటేసుకోటమే మార్గం. శివలింగమేమిటి, నిరాకారమైన ఈ ఆకాశమే. దీన్ని వాటేసు కోటమంటే మనసు నిరాకారమూ నిశ్చలమూ సర్వవ్యాపకమూ చేసుకొని జాగరూకుడై కూచోవాలని అర్థం. కూచుంటే అచేతనమైన ఈ ఆకాశమే చిదాకాశంగా మారి శవం కాకుండా మనలను శివమై కాపాడుతుంది. అదే మార్కండేయుడు వాటుసుకొంటే లింగంనుంచి ఈశ్వరుడావిర్భవించి యముణ్ని పారదోలాడని చెప్పే ఉదంతంలోని ఆంతర్యం. యముణ్ని పారదోలట మంటే మరణాన్ని దూరం చేసుకొని మానవుడమరుడై నిలవటమే.
Page 142