భావించమన్నారు మొదట పెద్దలు. దానికొక బాహ్యమైన సంకేతమే రామేశ్వరంలో సైకత లింగం. తరువాత అంతకన్నా విశాలమైన జలాన్ని భావించమన్నారు. దానికి సంకేతం శ్రీశైలంలో ఆపోలింగం. అలాగే క్రమంగా వారణాసిలో జ్యోతిర్లింగమూ, కాళహస్తిలో వాయు లింగమూ తేజోవాయు తత్త్వాలకు ప్రతీకలుగా భావించవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి రూపాన్ని దాటింది. చలనాన్ని కూడా దాటింది మన మనస్సు. అలాటి స్థితే ఆకాశం. దీనికి చిహ్నంగా భావించిందే చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశలింగమంటే లింగాకారంగా అక్కడ ఏదో లేదు. తెరదీస్తే మనకు కనిపించేది వట్టి శూన్యమే. ఆ శూన్యంలో దృష్టిసారిస్తే అది మన చైతన్యంతో నిండి జడమైన ఈ ఆకాశమే చిదాకాశంగా అనుభూతికి వస్తుంది. అప్పుడది శవంగాదిక శివం. స్వతహాగా శవమైనా చివరకిది ఆశివమైన తత్త్వాన్ని మన కందిస్తున్నది కాబట్టి ఇదే అచ్చమైన శివలింగం
పోతే దీనికి ముందున్న పృధి వ్యాది ప్రపంచం కొంతవరకు దోహదం చేసినా నామరూపాత్మకమే అదంతా. అనామమూ అరూపమైన తత్వాన్ని దర్శించాలంటే ఇందులో తారాడుతున్నంత వరకూ సుఖం లేదు. దీని పరిధి దాటిపోవాలి. దీని పరిధి సృష్టి స్థితులు రెండే. సృష్టి కాలంలో ఉన్నాయి నామరూపాలు. స్థితికాలంలోనూ ఉన్నాయి. సృష్టికధిపతి బ్రహ్మ అయితే స్థితికి విష్ణువు. వీరిద్దరికీ శివలింగ మాద్యంతాలు కనపబడలేదంటే ఏమిటర్ధం. నామరూపాలు దృష్టి ఉన్నంత వరకూ మానవుడి మనస్సుకు తదతీతమైన తత్త్వమంతు పట్టదని భావం. అవి రెండూ లయమైన మానసిక స్థితి ఏదో అదే సమర్థం దాన్ని పట్టుకోటానికి. దానికీ పాంచభౌతికమైన ప్రపంచాన్నీ దీనికి మూలమైన మాయాశక్తిని కూడా దాటి పోవలిసి ఉంటుంది. దానిని సూచించటానికే మన శరీరంలో తాంత్రికులు చేసిన షట్చక్ర నిరూపణ. అదీ ఒక సంకేతమే. మూలాధారం నుంచీ కంఠబిలం దగ్గరున్న విశుద్ధం దాకా వర్ణించే అయిదు చక్రాలూ పృధివ్యాది పంచభూతాలకు సంకేతాలు. ఈ అయిదింటికీ ప్రమథ గణమని పేరు. మానవుడి మనస్సునెప్పుడు ప్రాపంచికమైన ఆలోచనలతో మధిస్తుందిది. ఈ గణాని కథిదేవతకాగలిగితే గణపతి అవుతాడు సాధకుడు. అయితే ఆ పైన భ్రూమధ్యంలో ఉందొక చక్రం. ఆజ్ఞాచక్రం. శక్తి స్థానమది. అది దాట గలిగితే సకల జగత్తునూ శాసించే మాయాశక్తి వశమవుతుంది కాని అది నిరాశ్రయంగా
Page 141