#


Index

చిత్రతరంగిణి

అయితే ఏక మేవాద్వి తీయమని గదా దానికి పేరు. అలాటి అద్వితీయమైన తత్త్వం నుంచి ఎలా ఉద్భవించిందీ ఆకాశం. ఉద్భవించినట్టు భాసిస్తున్నదే గాని వాస్తవంగా ఉద్భవించటం కాదిది. దానికి కారణమనాది సిద్ధమైన మన అజ్ఞానమే. ఇదుగో ఈ అజ్ఞానమే రాత్రి. ఆ శివతత్త్వం మనందరికీ ఇప్పడగోచరం కాబట్టి రాత్రే మన పాలిటికి. మన పాలిటికజ్ఞానమైనా ఆయనకెప్పుడూ అధీనమైన శక్తి ఇది. మాయాశక్తి. అదే శివరాత్రి అంటే రాత్రి రూపిణి అయిన ఆ శక్తివల్ల ఆవిర్భవించిందే ఈ ఆకాశమనే లింగం. అర్ధరాత్రి లింగోద్భవమయిందని చెప్పటంలో ఇదే అంతరార్థం. అజ్ఞానులకది రాత్రిలాగా అగోచరమైనా జ్ఞానులకు పట్టపగలులాగా భగవతత్తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. పగలూరాత్రీ అనే తేడాలేకుండా నిత్యమూ శివాను సంధానంలో మెలకువ గలిగి ఉంటారువారు. కాబట్టి అంతా పగలే వారి పాలిటికి. కనుకనే యానిశా సర్వ భూతానాం, తాస్యాం, జాగర్తి సంయమీ అని చాటుతున్నది గీత. యద్య దాచరతి శ్రేష్ఠః అన్నట్టు అలాంటి జ్ఞాని దృష్టినే అలవరుచుకోవాలి బుద్ధి జీవులైన మానవులంతా. దానికి సూచకమే జాగరణమనే మాట. జాగరణ మంటే మేలుకోటం, రాత్రంతా మేలుకొని ఉండాలి. దేనితో శివస్మరణతో. చిదాకారమై ఆకాశంలాగా సర్వవ్యాపకమైన ఆ భావాన్నే స్మరిస్తూ దానితోనే గడపాలి రాత్రి. అంతేగాని పేకాటలతో, సినిమా పాటలతో గాదు. అలా గడిపితేనే అది శివరాత్రి. లేకుంటే శవరాత్రే మనపాలిటికి. ఎందుకంటే చైతన్య స్వరూపుడైన స్రష్టనుగాక అచేతనమైన సృష్టినే స్మరిస్తున్నాడు మానవుడు. శవంగాక శివమెలా అవుతుందది. ప్రాపంచికమైన ఆలోచనలే అసలు రాత్రి అంటే. అది అహస్సుగా మారాలంటే పారమార్ధికమైన జ్యోతిస్సునే పట్టుకోవాలి సాధకుడు. పట్టుకొని అనుక్షణమూ అలా ఏమరకుండా జీవించగలిగితే జీవితమంతా శివరాత్రీ జాగరణమే.

  అయితే ఇలాటి ఉత్తమాధికారు లెవరో కొందరే ఉంటారు లోకంలో. మిగతా కోటానకోట్ల జీవులందరూ మంద మధ్యములే. వారందరికి అంచెలవారిగా అందించాలా శివతత్త్వం. ఆకాశం నుంచి గాక వారు పృధివి నుంచి ప్రయాణం చేయాలి. ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృధివీ అని మిగతా భూతాలన్నీ ఆకాశం తరువాత సృష్టి అయినవే. అన్నీ ఆకాశంలాగా ఆ పరమాత్మ తత్త్వాన్ని సూచించేవే. కనుక మనం పుట్టి పెరుగుతున్న ఈ పృధివినే దానికి లింగంగా

Page 140

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు