#


Index

చిత్రతరంగిణి

మూలాన్నే గదా. ఈ సాంఘిక చైతన్యమనే మాటకు కూడా మనమిచ్చే విలువనుబట్టి ఉంటుంది. ఒకరి దృష్టికి చైతన్యమయింది మరోకరి దృష్టికి కాకపోవచ్చు. వర్ణాశ్రమధర్మాలు పాటిస్తూ పరస్పర సహజీవనం చేయటమే సమాజానికి శ్రేయస్సని భావించారు మన పూర్వులు. ఈనాడది సమాజాభ్యుదయానికి నిరోధకంగా భావిస్తున్నారు నవీనులు. అంచేత దేవకాలాలను దృష్టిలో ఉంచుకొని కూడా చూడవలసి ఉంది. కవులు కూడా తమతమ దేశకాలాలను బొత్తిగా విస్మరించలేదు. అంతెందుకు నన్నయ జగద్ధితంబుగన్ అని అంటే తిక్కన ఆంధ్రావళి మోదముం బొరయ భారత రచన చేస్తున్నానంటాడు. అప్పటి ఆంధ్రజాతిలో ఎన్నో సమస్యలు తలఎత్తటం చూచి వాటి పరిష్కారకంగా భారతకథను అడ్డం పెట్టుకోవలసి వచ్చిందా మహాకవి.

  ఇలాంటి వెన్నో ఉన్నాయి రహస్యాలు. ఇంతకూ కవిత్వమనేది ఒక కళ. కవి కళాకారుడు. అయితే సంఘజీవి కాబట్టి సాంఘిక శ్రేయస్సుకే రచన సాగించాలి. అంతవరకూ అతనికి బాధ్యత ఉంది సందేహం లేదు. కానీ దాన్ని సాధించటాని కతడెలాటి వస్తు సామాగ్రి తెచ్చుకొంటాడో అది ఏ దేశకాలాలకు చెందిందో దానితో ఎలాంటి ఇంద్రజాలం ప్రదర్శిస్తాడో మనం అడగకూడదు. అది లౌకికం కాదు. అలౌకికమైన కళాధర్మం.











Page 137

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు