#


Index

చిత్రతరంగిణి

ఉండటం అన్వయం. అలా వ్యాపించి ఉన్నదే నేననే స్ఫురణ. అన్నమయాది పంచకోశాలనుంచి ఈ ఆత్మతత్త్వాన్ని వేరుగా భావిస్తే అది తత్త్వవివేకం.

  6. అలాగే బాహ్యమైన ఈ భౌతిక జగత్తుకూడా సృష్టికి ముందులేదు. ఈశ్వర చైతన్యంతో ఏకమే. తరువాత ఆ ఈశ్వర సకల్పవశాత్తూ ఆకాశాది క్రమంలో అవతరించింది. అదే బాహ్యంగా బ్రహ్మాండమూ- ఆంతర్యంగా పిండాండమూ అయింది. మరి ఎంత పరిణమించినా ఇది అస్తి-భాతి అనే లక్షణాలను వదలకుండానే కనిపిస్తున్నది. అంచేత సజాతీయ విజాతీయాది భేదాలన్నీ దాని అభాసలేనని వివేచనచేసి చూస్తే - ఇదంతా మరలా ఆ శుద్ధ చైతన్యమేనని బోధపడుతుంది. దానితో భూతవివేకం-కోశవివేకం కూడా కలిసి వస్తుంది.

  7. పోతే ఈ వివేచన జీవుడే చేయాలి ఎప్పటికైనా. కారణం ఈశ్వర సృష్టికాదు జీవసృష్టే మనకు బంధకం. ఎందుకంటే బాహ్యంగా ఒకటి జరిగినా మనసుకు రానంతవరకూ బాధలేదు. జరగకున్నా మనసుకు తెచ్చుకొంటే బాధే. సుఖ దుః ఖాలు నియతం కావు. ఒకడికి సుఖమయింది ఇంకొకడికి దుఃఖం. మూసలో పోసిన సువర్ణరసానికా మూస అకారమే వచ్చినట్టు మనోవృత్తి ఆయా నామరూపాలను భావన చేయటం వల్లనే తత్తదాకారంగా పరిణమిస్తున్నది. సుఖదుఃఖాది భావాలనుభవిస్తున్నది. ఇదే సంసారబంధం. కనుక విషయాకారంగా కాక మన బుద్ధివృత్తి నాత్మాకారంగా మార్చుకోవాలి. అదే సాయుజ్యాన్ని ప్రసాదించే ద్వైత వివేకం.

  8. మరి దీనికి మార్గమేమిటి. వాక్యార్థ విచారణ మొక్కటే మార్గం. తత్త్వమస్యాది వాక్యార్థాన్ని శ్రవణమననాదులు చేస్తే వాచ్యార్ధమైన దేహేంద్రియాదులు పృధి వ్యాదులు లయమై లక్ష్యార్ధమైన శుద్ధ చైతన్య మొక్కటే అఖండంగా అనుభవానికి వస్తుంది. ఇది అయిదవదైన మహావాక్య వివేకం. దీనితో వివేక పంచకం సమాప్తం. 9. పోతే దీని వెలుగులో ఇక దేహేంద్రియాదికమైన ఉపాధి వర్గమంతా ఏమిటో దర్శించాలి. అండ పిండాత్మకమైన ఈ సృష్టి అంతా అసలేమిటి. ఎలా ఏర్పడింది. అదే చిత్రం. చిత్రదీపం. స్వతహాగా శుభ్రమైన వస్త్రం ఘట్టితమై లాంఛితమై చిత్రితమవుతుంది. ఎంత చిత్రితమైనా- అది ఆ వస్త్రాన్ని విడిచి ఎక్కడాలేదు.

Page 126

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు