అవిమూడూ పరిత్యజిస్తే వాటికిమారుగా మిగిలింది ఇక నీ ఆత్మ చైతన్యమొక్కటే. దాన్నే శరణువేడు అంటే అదే సర్వదా సర్వత్రా సర్వపదార్ధాలలోనూ ఉందని చూడు.
ఇదిగో ఈ చూపే జ్ఞానం. దీనిని అంటి పట్టుకోటమే భక్తి. అందులో ఇక
అన్యమనే చింతలేదు కాబట్టి అనన్య భక్తి. భక్త్యా త్వనన్యయా లభ్యః ఈ అనన్య భక్తి
రూపమైన జ్ఞాననిష్ఠ వల్లనే అనాత్మభావం పూర్తిగా కరిగిపోతుంది. అంటే
అనాత్మరూపంగా ప్రవిలయమై అదే ఆత్మరూపంగా మరలా అనుభవానికి వస్తుంది.
వస్తే ఇక ఈ అనాత్మ ప్రపంచంవల్ల ఏర్పడే విషాదం పూర్తిగా తొలగిపోతుంది.
తొలగటమే మోక్షం. మన సమస్యకు పరిష్కారం. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి"
అనాత్మరూపమైన పాపాలన్నిటి నుంచీ నిన్ను ఈ సర్వాత్మ భావనే విముక్తుణ్ణి చేస్తుంది.
అయితే ఆ స్థాయి నందుకోవాలంటే నేనే ఈ సర్వమూ- ఈజీవుడైనా నేనే ఈ
జగత్తయినా నేనే ఆ ఈశ్వరుడైనా నేనేనని సర్వమూ నా స్వరూపంగా చూచే జ్ఞానాన్ని,
అభ్యసించాలి. దానికి ముందు 'నిత్యస్సర్వగతఃస్థాణు రచలోయం సనాతనః ఇలాటి
లక్షణాలు గల ఒక ఈశ్వరుడున్నాడనే స్ఫురణ ఉండాలి. అది కలగాలంటే
మనస్సుకేకాగ్రత కావాలి. దానికి సత్త్వశుద్ధి ఏర్పడాలి. అందుకు దుష్కర్మలుమాని
సత్కర్మలే ఆచరించాలనే నియమనిష్ఠలుండితీరాలి. అంచేత కర్మానుష్ఠానం మొదలుకొని
భక్తి యోగం దాకా ఒకదానికొకటి విరుద్ధం కావు. విరుద్ధం కాకపోగా ఒకదానికొకటి
సహకారులు. సోపానాలలాగా క్రిందిస్థాయి పైస్థాయి కంచెలవారిగా తోడుపడుతూ
సాధకుణ్ణి చివరకు జ్ఞానమనే కడపడి భూమికలో ప్రవేశపెడతాయి. ఆ జ్ఞానం
నిష్ఠగా పరిణమిస్తే చివరకదే ఈ విషాదసాగరంలో నుంచి మనకు మోక్షాన్ని
ప్రసాదిస్తుంది. ఇందులో విషాదమనేది సమస్య అయితే మోక్షం దానికి పరిష్కారమైతే
సర్వాత్మ భావరూపమైన జ్ఞాననిష్ఠ నలవరచుకోవటమొక్కటే సాధన మార్గం. ఇదే
భగవద్గీత ముముక్షువులైన మానవులందరికీ అందజేసే సందేశసారం.
ఓమ్
శాంతిః శాంతిః శాంతిః
Page 123