అలమటించే మన జీవితాలకే ఒక అందమైన దివ్య సందేశాన్ని అందిస్తాయి. మహీయాంసఃప్రకృత్యామితభాషిణః - పెద్దలెప్పుడూ తూచినట్టు కొద్దిగానే మాట్లాడుతారు. “జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధకార్యవస్తుని- ఎంతతెలసినా ఒక్కడుగా ఏ కార్యాన్ని గురించీ ఆలోచించలేడు. క్రియా కేవల ముత్తరమ్ - మాటకెప్పుడుగానీ ఆచరణమే జవాబు. గ్రంధానధీత్య వ్యాకర్తు- మితి దుర్మేధసోప్యలమ్ పుస్తకాలు చదివి ఒకరికీ ఏకరువు పెట్టటమనేది దుష్టబుద్ధికూడా చేయగలడు. “అనిర్ధారిత కార్యస్య వాగ్జాలమ్ వాగ్మినోవృధా పనికితరంగాని పట్టిమాట లెన్ని చెప్పినా అదివృథా. మూలంహి మహద్వైరతరోః స్త్రియః - పరస్పరద్వేషమనే వృక్షానికి మూలం స్త్రీలే. ఇది భారత రామాయణేతిహాసాలు రెండింటినీ మనకు కళ్ల ఎదుట నిలుపుతున్నదీమాట. కథాపిఖలు పాపానా మలమ శ్రేయసే-దుర్మార్గులను గూర్చిన ప్రసంగంకూడా మనకు మేలుగాదు, సర్వః స్వార్ధమ్ సమీహతే-ప్రతిఒక్కడూ లోకంలో స్వార్ధమే కోరుతుంటాడు. ఆరంభంతే అల్పమే వాజ్ఞాః కామమ్ వ్యగ్రా భవంతిచ-కొద్దిపాటి పనికే ఎంతో హడావుడిగా కనపడుతారు కొందరు. మహారంభాః కృతధియ స్తిష్ఠంతిచ నిరాకులాః ఎంతో పెద్ద కార్యభారం తలపెట్టి కూడా మహాత్ములు కొందరు మాత్రమే హడావుడి చూపరు. తొణకరు. క్షణేక్షణే యన్నవతా ముపైతి తదేవ రూపమ్ రమణీయతాయాః క్షణక్షణానికి ఏది క్రొత్తగా కనపడుతుందో అదే అందమనే మాటకర్థం. ఇలాటి సుభాషిత రత్నరాసులకు కొదవేలేదా మహాకవికి.
7. అసలా మాటకువస్తే మాఘుడొక రత్నాల వర్తకుడయి ఉంటాడని అనుమానం. సముద్రయానమూ-నౌకావ్యాపారాన్ని గూర్చి వర్ణిస్తాడు. వస్త్రవ్యాపారి అయినా కావచ్చు. చిత్రవిచిత్ర కంబళాలు - వస్త్రవిశేషాలనూ గూర్చి తన పరిజ్ఞానాన్ని బయటపెడతాడు. మాఘుడు గుజరాతు రాష్ట్రనివాసి అనీ వణిగ్వంశ సంజాతుడనీ పరిశోధకులు కూడా చాటుతున్నారు. 14వ శతాబ్దిలో రచించిన ప్రభావక చరితమనే గ్రంథములో ప్రభాచంద్రుడనే రచయిత ఇతణ్ణి ఘూర్జర దేశ వాస్తవ్యుడు దత్తకుడనే శ్రేష్ఠికి పుత్రుడని-మాళవ దేశాధిపతి భోజరాజుకు బాల్యమిత్రుడని వర్ణించాడు. ఈ కవి అంటే భోజుడికి ప్రాణం. భోజుడెంత దానశీలుడో మాఘుడూ అంత గొప్పవదాన్యుడు. సాధారణంగా కవులూ కళాకారులూ ఒకరి దగ్గర పుచ్చుకోటానికే
Page 114