#


Index

చిత్రతరంగిణి

అందుకే ఇంత సర్వాంగ సుందరమనే దృష్టితోనే కావ్యేషు మాఘః - అని మాఘుడి కావ్యానికే అగ్రతాంబూలమిచ్చింది రసజ్ఞలోకం. ఇది ఏదో ప్రశంసకోసం చెప్పిన మాట కూడా కాదు. కావ్యాన్ని అమూలాగ్రమూ పరిశీలించి చూచిన ప్రతి సహృదయుడికీ తార్కాణమయ్యే సత్యమే.

  3. దీపశిఖా కాళిదాసమని కాళిదాసు కొకపేరున్నది. స్వయంవరంలో రాజులు బారులుతీరి ఉంటే వారి మధ్య తిరిగే ఇందుమతి అనే కన్య "సంచారిణీ దీపశిఖేవ” రాత్రి వీధి వెంట కొనిపోయే దీపవృక్షంలాగా ఉందని వర్ణించాడా మహాకవి. ఆ ఉపమాసౌందర్యానికి ముగ్ధులయి ఆయనకు దీపశిఖా కాళిదాసమని ఆపేరే సార్ధకం చేశారు పండితులు. అలాగే మాఘుడి ఒకానొక ఔపమ్యకల్పనకు పరవశించి ఆయనను ఘంటామాఘుడని కొనియాడారు. రైవతకమనే ఒక పర్వతాన్ని వర్ణిస్తూ ఆయన ఒకవైపు సూర్యోదయం మరొకవైపు చంద్రాస్తమయ మవుతుంటే ఆ రెండింటి కిరణాలు పైకి ప్రసరిస్తుంటే రెండు పెద్ద గంటలు తన పొట్ట కిరుప్రక్కల త్రాళ్ళతో బిగించి కట్టిన మదపుటేనుగులా ఉందా పర్వతమని వర్ణించాడు. "పహతి గిరిరయమ్ విలంబి ఘంటాద్వయ పరివారిత వారణేంద్ర లీలామ్" ఇది ఆయన ఔషమ్యకల్పనకొక మచ్చుతునక మాత్రమే. ఇలాంటి విలువైన అలంకారాలు వందలు వేలున్నాయి.

  4. పోతే శబ్ద సౌష్ఠవానికీ తదసుగుణమైన అర్థగాంభీర్యానికి ఇక్కడా అక్కడా అని తడవబనిలేదు. కావ్యమంతా ఉదాహరణమే. ఎక్కడ ఏ శబ్దం వాడాలి అది ఏ అర్ధం చెప్పటానికెంత మోతాదులో వాడాలి. ఈ విద్య ఆయనకు తెలిసినట్టెవరికీ తెలియదు. “ఆచ్ఛాదితాయుత దిగంబర ముచ్చకైర్గా-మాక్రమ్య సంస్థిత ముదగ్ర విశాల శృంగమ్ మూర్డ్ని స్థలత్తుహిన దీధితి కోటిమేన-ముద్వీక్ష్యకో భువి న విస్మయతే నగేశమ్" - ఇదీ రైవతకవర్ణనే. అది నగేశుడన్నందుకు ఈశుడిలాగానే కనిపిస్తున్నదట, దిగంబరాన్నే ఆచ్ఛాదనంగా చేసుకొన్నాడీశ్వరుడు. ఇదీ దిక్కులనూ అంబరాన్నీ ఆచ్ఛాదించే ఉన్నది. ఆయన విశాలశృంగమైన గోవృషాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఇదీ విశాలోన్నత శృంగాలంటే శిఖరాలతో-గో అంటే భూమినంతా ఆక్రమించి ఉంది. ఆయన తలమీద చంద్రుడున్నట్టే దీని తల అంటే పైభాగం మీద చంద్రుడు సంచరిస్తున్నాడు. అలాటిదాని స్వరూపాన్ని దర్శిస్తే ఎవరికి విస్మయం కలగదంటాడు.

Page 112

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు