స్వార్ధంగా ఎప్పుడూ భావించరాదు. స్వార్థంగా భావించటానికది మన ఒక్కరిదైతేగదా. విశ్వవ్యాప్తమైన ఆ అర్థం విశ్వానికంతా చెందవలసి ఉంది. తన ఒక్కడికేగాదు. అంచేత తేనత్యక్తేన భుంజీథాః" త్యజిస్తూ భుజించాలి మానవుడు. అంటే అనుభవిస్తున్నప్పుడు కూడా ఇది నాది కాదనుకొంటూనే అనుభవించాలి. “మాగృధః కస్యస్విద్ధనమ్” ఎంచేతనంటే నీ ఒక్కడిదేగా దాశపడటానికి, అందరిసొత్తూనంటున్న దుపనిషద్వాణి కనుకనే వేదవ్యాసుడు అర్ధస్య పురుషోదాసః దాసస్త్వర్ట్తో నకస్యచిత్ అని ఘోషించాడు. అర్ధానికే మానవుడు బానిసగానీ ఏ మానవుడికీ అర్ధం బానిసగాదట. ఈ సత్యాన్ని గ్రహించి బాగుపడండి లోకులని చెప్పటమే అమ్మవారి అగ్నిప్రవేశం. అమ్మ అంటే ధనం. అది విష్ణువర్ధనుడి లాంటి స్వార్ధపరులు తమ సొంతం చేసుకోవాలని తమకే దక్కాలని ఆశ పడవచ్చుగాక, అది వారికి దక్కదు. అదృశ్యమయిపోతుంది, అదృశ్యమయి సర్వుల మనస్సులలో భావరూపంగా ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఇలా ప్రబోధిస్తుంది. బిడ్డలారా నేనెవరో గుర్తించండి. నన్నెవరూ సొంతం చేసుకోవటానికి యత్నించకండి. నేనే జీవితగమ్యమని భావించకండి. నన్ను సకల జగద్వ్యాపినిగా దర్శించి నిష్కాములై నన్నొక సాధనంగా చేసుకొని సత్కర్మలాచరిస్తూ దానివల్ల పరిశుద్ధులయి ధర్మాన్నో - సర్వధర్మాలనూ చివరకు పరిత్యజించి మోక్షాన్నో అందుకొని తరించండి. అలా నా మార్గాన్ని అనుసరించారంటే మీరు ఆర్యులు-శ్రేష్ఠులు నాచేత గుప్తులు అవుతారు. లేకుంటే కదర్యులు జ్ఞాన బహిష్కృతులూ అయిపోతారు. ఇదే ఈ కథలో ధ్వనించే పరమ సత్యం.
Page 110