#


Index

చిత్రతరంగిణి

కాహుతి అయిపోగలరని శపించగా తాను కూడ ఆతనిని తన మాదిరే భూమిపై జన్మించి తన్ను బలాత్కరించిన కారణంగా శిరస్సు వేయి వక్కలయి దారుణంగా మరణిస్తావు పొమ్మని శపించింది. అతడే తరువాత కొంతకాలానికి చోడవిష్ణు వర్ధనుడయి జన్మించి రాజమహేంద్రమును పాలించే చాళుక్య విష్ణు వర్ధనుడి రాజ్యాన్ని అపహరించి స్వాధీనం చేసుకుంటాడు. అతనికి సామంతుడయి పెనుగొండ నగరాన్ని పాలించే కుసుమగుప్త అనే శ్రేష్టికి కుమార్తె అయి జన్మిస్తుంది అమ్మవారు. ఆమెకు వాసవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. ఒకనాడు విష్ణువర్ధనుడు కుసుమగుప్త ఆహ్వానముపై పెనుగొండకు వచ్చి అతడు తనకై ఏర్పరచిన విడిది మందిరంలో కూర్చుని మంత్రులతో ముచ్చటిస్తూ అదాటుగా ఎదురుగా ఉండే మేడమీద సంచరించే వాసవిని చూచాడు.

  చూడగానే ఆవిడ అతిలోక సౌందర్యానికి ముగ్ధుడయి ఆవిడను తనకు కైవసం చేసుకోవాలని ఆసించాడు. కుసుమశ్రేష్టికి తన మనోరథం వెలిబుచ్చగా అతడు వైశ్యులు వర్ణాంతర వివాహానికి అంగీకరించరని పైగా తన కుమార్తె గౌరవబాలగానే అంటే ఆజన్మ బ్రహ్మచారిణిగానే ఉండిపోవాలని దీక్షబూనిందని కాబట్టి ఆవిడనిచ్చి వివాహం చేసే ప్రసక్తే లేదని విన్నవిస్తాడు. దురాగ్రహపరుడైన విష్ణు వర్ధనుడా మాటకు మండిపడి బలవంతంగానైనా ఆవిడను చెట్టపట్టాలని చూస్తాడు. కుసుమగుప్తుడదిచూచి తన కులము వారందరితో గూడి ఆలోచిస్తుంటే అమ్మవారది కనిపెట్టి నామూలంగా మీరెవరూ బాధపడకండి. నేనే అతనికి తగిన పాఠం నేర్పుతానని అగ్నికుండంలో ప్రవేశిస్తుంది. ఆవిడతోపాటు నూటరెండు గోత్రాలవారు ప్రవేశించి ఆత్మాహుతి చేసుకుంటారు. ఆహుతి అయ్యేముందు దేవి విష్ణువర్ధనుని తల పగిలి వేయివక్కలయ్యేలాగా శపిస్తుంది. అతడలాగే దుర్మరణం పాలవుతాడు. అమ్మతో ఆహుతి అయిన నూట ఇబ్బండ్రు గోత్రాలవారే అసలైన ఆర్యవైశ్యులు. మిగుతా ఆరువందల పైచిలుకువారు అమ్మ ననుసరించి వెళ్ళలేదు. కాబట్టి కుల బహిష్కృతులయి బేరి గౌర కోమట్లుగా చెలామణి అయినారు.

  కథగా చెప్పుకుంటే కన్యకా పరమేశ్వరి కథ టూకీగా ఇంతే. కాని ఇది కథామాత్రంగా కనిపించదు నాకు. కథలన్నీ అర్ధవాదాలేనని శాస్త్రజ్ఞుల వచనం. అంటే

Page 108

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు