#


Index

చిత్రతరంగిణి

  మరొక విశేషమేమంటే ఏకేశ్వర వాదాన్ని ఇస్లాము కూడా ప్రతిపాదిస్తుంది గాని అది ఈశ్వరుణ్ణి కేవలం నిర్గుణంగానే అంగీకరిస్తుంది. సగుణం వారికి పనికేరాదు. అస్పృశ్యులను చూచినట్టు చూస్తారు సగుణారాధకులను. అంతేకాదు. కాపరులని పేరుపెట్టి ఎంతో మంది హిందువులను హింసించటానికి కూడ వెనుదీయలేదు. ఇంతకన్నా అవివేకం మరొకటి లేదు. ఈశ్వరుడొక్కడే ఉన్నప్పుడతడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెప్పినప్పుడు ఎంత నిర్గుణమో అది అంత సగుణంగూడా గావాలికదా. అలా కాకపోతే ఈ కనపడే నామరూపాలన్నీ ఏమిటి. ఇవి ఈశ్వరతత్త్వానికి బహిర్భూతమా-అంతర్భూతమా? బహిర్భూతమైతే ఇవి ఈశ్వరుడు లేకపోవటమే కాదు. ఈశ్వరుడు వీటిలోనూ ఉండటానికిలేదు. కాబట్టి ఆయన పరిపూర్ణుడని చెప్పటానికి వీలులేదు. ఈ రహస్యాన్ని గుర్తించింది మన హైందవమత మొక్కటే కనుకనే “పూర్ణమదః పూర్ణమిద" మ్మని రెండింటినీ పూర్ణంగానే భావించింది. తత్త్వాన్ని పరాపర స్వరూపంగా భావించింది. పర అంటే నిర్గుణమైన తత్త్వం. అవరమంటే సగుణం. ఇందులో మొదటిది మూలతత్త్వమైతే రెండవది దాని విభూతి. ఇలాంటి సమన్వయదృష్టి ఒక్క హిందూమతంలో తప్ప మరి ఏమతంలోనూ కనిపించదు. దీనితో విగ్రహారాధన దగ్గరినుంచీ కేవల మౌనస్థితివరకూ అన్ని విధములైన సాధనలకు అవకాశం లభించింది.

  ఇంకొక విశేషమేమంటే మానవుడికి జన్మాంతరాలూ లోకాంతరాలూ ఒప్పుకొన్నది మన మతమొక్కటే. మిగతా మతాలేవీ జన్మ పరంపర ఒప్పుకోలేదు. ఇస్లాము క్రైస్తవం లాంటి మతాలను బట్టి చూస్తే మానవుడికొక్కటే జన్మ. ఇది సార్థకం చేసుకోవటమో నిరర్థకం చేసుకోవటమో మన చేతిలో ఉంది. చచ్చిన తరువాత ఒకానొకరోజు నిర్ణీతమై ఉంటుంది. ఆరోజు మన ఆత్మను తీసుకుపోయి దేవుడి దగ్గర హాజరు పరుస్తారు. మనం చేసుకొన్న పుణ్యపాపాలను విచారించి వాటికి తగిన ఫలితం మనకందచేస్తారు. ఇంతే విషయం. ఇక ఈ జీవుడికి మరలా జన్మలేదు. ఇది చాలా విడ్డూరంగా తోస్తుంది. మానవుడు సహజంగా అపరిపూర్ణుడు. వాడు పరిపూర్ణత నార్జించినప్పుడే ముక్తి. అంతవరకూ ప్రయాణం తప్పదు. జన్మలనేవి ఆ ప్రయాణంలో మజిలీల లాంటివి. ప్రతీ మజిలీలోనూ కొంత కొంత జ్ఞానాన్ని ఆర్జిస్తూపోతేగాని

Page 100

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు