చేయటమే భజే అనే మాట కర్ధం. ఎలా చేయాలా ఉపస్థానం. ఉపస్థానమంటే భజనమే. ఎలాగా అది. మూడు విధాలది. ప్రాతర్మధ్యాహ్న సాయాహ్నాలనే మూడు సంధ్యలు గదా అవి. అంచేత మూడు సంధ్యలలో సూర్య భగవానుడు మూడు రూపాల్లో దర్శనమిస్తుంటే మూడు మంత్రాలు జపిస్తూ తద్ద్వారా ఆ దివ్య చైతన్య ప్రకాశాన్ని మనసులో నింపుకోవాలి మనం. అదే నిజమైన ఉపస్థానం. పోతే మూడు కాలాలకూ మూడు మంత్రాలున్నాయి మనం పఠించవలసినవి.
ప్రాతః కాలంలో సూర్యుడి పేరు మిత్రుడు. మధ్యాహ్న కాలంలో సవిత. సాయంకాలంలో వరుణుడు. వరుణుడెవడో గాదప్పటికి మిత్రుడే. అందుకే మిత్రావరుణ అని ఒకే ఒక దేవతగా పేర్కొన్నారు పురాణాల్లో. మిత్రా వరుణుడి కుమారుడే మైత్రావరుణి. వషిస్థుడు. అగస్త్యుడు. వీరిద్దరికీ మైత్రావరుణి అని పేరు. వారి అంశలో జన్మించారు. మిత్రుడయ్యాడట సూర్యభగవానుడు ప్రాతః కాలంలో లోకానికి. లోక బాంధవుడని జగన్మిత్రుడని అందుకే పేరు వచ్చింది. ఆయన ఉదయించినప్పుడే మనకు జీవితమనేది సాగుతున్నది. అన్ని వ్యవహారాలూ చేయగలుగుతాము. కండ్లు తెరవగలగుతా మసలు. సృష్టి ఆయన వల్లనే ఇలా జరుగుతున్నది గనుక మనకాయన మిత్రుడయ్యాడు. మైత్రి అంటే అసలు శబ్దార్ధం కలుసు కోటమని. మొట్టమొదటి సారిగా మన మాయనను కలుసుకొన్నాము. ఆయన మనలను కలుసుకొంటున్నాడు. తరువాత మనకాయన సవిత.
Page 87