ఉత్తరార్ధమ్
89
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం-తత్పర స్సంయతేంద్రియః
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి-మచిరేణాధి గచ్ఛతి 4-39
దేనికైనా చివరకు శ్రద్ధ అనేది ప్రధానం. జ్ఞానానికైనా అదే. విజ్ఞానానికైనా అదే. అది తల్లిలాగ సాధకున్ని కొనా మొదలూ కాపాడుతూ వస్తుంది. అంచేత అది ముందు లభిస్తే గాని ఇది క్రమంగా అనుభవానికి రాదు. ఆయితే ఈ శ్రద్ద అనే దేమిటి. ఏ రూపంలో ఉంటుందది. "తత్సర" అన్నారు. ఒక విషయంలో తత్పరత్వం లేదా తాత్పర్యం గలిగి ఉండటమే శ్రద్ద. తత్పరత్వ మంటే ఆదే లోకంగా మెలగటం. మరే అవరోధనా మనసుకు రాకపోవటమని ఆర్థం.
అది ఎలా ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం పూర్తిగా ఉన్నప్పుడే ఏర్పడు తుంది. ఇంద్రియాలంటే కర్మేంద్రియాలూ ఉన్నాయి. జ్ఞానేంద్రియాలూ ఉన్నాయి. వెలపలి విషయాలు లోపల కందించేవి జ్ఞానేంద్రియాలైతే లోపల వాటిని వెలపలికి జారీ చేసేవి కర్మేంద్రియాలు. వీటికి నాయకులు అటు మనస్సూ-ఇటు ప్రాణమూ. ఈ కలాపమంతా ఇంద్రియాలనే జాతి క్రిందకే వస్తుంది. వీటి నదుపులో పెట్టుకోవాలి సాధకుడు.
ఇంత తరిఫీదు అయితే మనం జ్ఞానమనే ధనాన్ని ఆర్జించటానికి నోచు కొంటాము. జ్ఞానమంటే పరోక్షాపరోక్షాలు రెండూనని అర్ధంచేసుకోవాలి. ఇలాంటి జ్ఞానం సాధకుడి కబ్బిందంటే దానికొక్కటే తార్కాణం. శాశ్వతికమైన శాంతి లభించాలి సాధకుడికి. అదికూడా ఎప్పుడో కాలాంతరంలో కాదు. జ్ఞాన మెప్పు డబ్బిందో అప్పుడే.