ఉత్తరార్ధమ్
79
ప్రకృతేః క్రియమాణాని - గుణైః కర్మాణి సర్వశః
అహంకార విమూఢాత్మా-కర్తాహ మితి మన్యతే 3-27
అయితే మీరెంత చెప్పినా ఇరువురూ చేసేపని ఒక్కటేకదా. అది ఒకరి మెడకు చుట్టుకోటమేమి. వేరోకరికి ఏ మాత్రమూ అంటక పోవటమేమి. నిప్పులో వేలు తెలిసి పెట్టినా తెలియక పెట్టినా కాలక మానదు గదా. అని మరలా ఆశంక.
వాస్తవమే, అదినిప్పే అయితే మీరు చెప్పినట్లు తెలిసిపెట్టినా తెలియక - పెట్టినా కాలుతుంది. తప్పదు. కానీ నిప్పుకాక నిప్పులాగా కనిపించే పదార్థమైతే "అప్పుడేమంటారు. ప్రపంచ మిప్పు డలాంటి పదార్థం. ఇది మనం చూస్తు న్నట్టుగా అక్కడలేదు. ఉన్నదెప్పుడూ ఒక ఆత్మ చైతన్యమే. అదేమన ఆవిద్యవల్ల నామరూపాత్మకంగా భాసిస్తున్నది. మనమంతా అవిద్యాభూమికలో ఉన్నంత వరకూ మనకది యథార్థమే. దానివల్ల మనం పొందే బాధలూ యథార్థమే.
అయితే ఎంత యథార్థ మంటున్నా అది మన అజ్ఞాన భూమికలోనే అనే మాట మరచి పోరాదు. అజ్ఞానం ఆత్మజ్ఞానం చేత ఎప్పుడు రూపు మాసిందో అప్పుడిక ప్రపంచమూ లేదు దానితో వ్యవహారమూ లేదు మానవుడికి, వాడాత్మ స్వరూపుడయి సర్వమూ అత్మగానే అనుభవానికి తెచ్చుకొంటాడు. అలాంటప్పు డిక నిప్పేమిటి. కాలట మేమిటి. ప్రపంచ మనేదే కదా నిప్పని నీవు భ్రమిం చటం. అది పట్టి భ్రమే గాని వస్తురూపంగా లేదని గ్రహించి నప్పుడిక బాధ ఏముంది.
మరి ఎవడికీ బాధ, ఎక్కడిదిది. ప్రకృతిలో జరిగే వ్యవహార మంతా ప్రకృతి గుణాల వల్లనే జరుగుతూ ఉంటుందని గుర్తించక నా మూలంగానే ఈ పని జరుగుతూ ఉంది నేనే దీనికి కర్తనని ఎవడహంకరిస్తాడో వాడికే. దారిన పోయే శని గ్రహాన్ని నెత్తికి తెచ్చుకోవట మిది. దీనితో వివేకం దెబ్బతిని విమూఢుడవు తాడు. మానవుడు.