ఉత్తరార్ధమ్
67
నహి కశ్చిత్ క్షణమపి-జాతు తిష్ఠ త్యకర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ-సర్వః ప్రకృతిజైర్గుణైః 3-5
కాకపోయినా ఏపనీ చేయకుండా ఊరకకూచుందామంటున్నారే అది ఎలా సాధ్యం. అలా కూచోగలవా ఒక్క క్షణమైనా. ప్రతి క్షణమూ జీవితంలోఏదో ఒక పని చేస్తూ ఉండవలసిందే తప్పదు. మనసుతోనో మాటలతోనో - దేనితో నైనా సరే కర్మ అనేది దాని పాటికది జరుగుతూనే ఉంటుంది. నీవు చేయనని భీష్మించుకున్నా ప్రయోజనంలేదు.
ఏమీకారణం. ప్రకృతి అనేదొకటి ఉందికదా. అదే చేయిస్తుంది నీచేత. ప్రకృతి అచేతనం కదా ఎలా చేయిస్తుందని అడుగుతావేమో. సత్త్వమూ- రజస్సూ-తమస్సూ అని మూడు గుణాలున్నాయి దానికి. అవి బాహ్యంగానే కాక మానవుడికి లోపల కూడా ఓతప్రోతంగా అల్లుకొని ఉన్నాయి.
అవి పేరుకు మూడైనా ముప్పది మూడుకోట్ల అవతారాలెత్తి మన ప్రాణం తీస్తుంటాయి. ప్రతిక్షణమూ అవి రకరకాల మనోవృత్తులను రేకిత్తిస్తూ ఉంటాయి. అవి బాహ్యమైన శబ్దస్పర్శాదులతో లావాదేవీ పెట్టుకొంటాయి. దానితో ఒక అభేద్యమైన పద్మవ్యూహం తయారవుతుంది. ఈ వ్యూహంలో అభిమన్యుడి లాగా జొరబడటమే తెలుసునుగాని మనమనస్సుకు అందులో నుంచి బయట పడటం తెలియదు.
అచేతనమైనా మనసును ప్రేరణ చేసే శక్తి ఈ గుణాలకు అయస్కాంతం లాగా సహజంగానే ఉంది. మానవుడు చేసుకొన్న సంచిత కర్మవల్ల వాటి కది సంక్రమించింది. ఆ కర్మ వాసనా బలమే వాటి బలం, దానితో ఈ గుణాలు మనసును పురి కొల్పితే-అది ఇంద్రియాలకు ఉత్తరువిస్తే తద్ద్వారా కర్మలన్నీ జరుగుతుంటాయి. లేకుంటే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలకు కూడా నోచుకో లేము మనం. ప్రతి క్షణమూ మన ఎరుకతో జరుగటం లేదు కదా అవి. కాబట్టి నీ వశంలో లేకుండానే జరిగే కర్మ కాండ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సంక ల్పిస్తే అన్నిటికీ స్వస్తి చెప్ప గలననే మాట వట్టి మాట.