పూర్వార్థమ్
35
ఉదారా స్సర్వ ఏవైతే-జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్
అర్తాదు లందరూ ఉదారులు కారా అంటే ఉదారులే. సందేహం లేదు. మరీ పశుప్రాయంగా బ్రతికే అనేక లక్షలమంది కంటే ఎప్పుడో ఒకప్పుడు కష్టంలోనైనా పరమార్థాన్ని స్మరించే వాడు గొప్పవాడే. కష్టం ప్రాప్తించినప్పుడే కాక కోరికల నెపంతోనైనా తరుచుగా స్మరించేవాడు అంతకన్నా గొప్ప. పోతే అవి రెండూ కూడా తుచ్చంగా భావించి అసలు విషయ మేమిటో తెలుసు కోవాలని కాంక్షించే వాడు గొప్ప మహనీయుడు. అయితే ఎంత మహనీయు డైనా ఆ పరమార్థాని కింకా దూరంగానే ఉండిపోతున్నాడు కాని దగ్గరపడటం లేదు. అలా దగ్గరగా వచ్చి నీవే నేను- నేనే నీవని దానితో ఏకత్వాన్ని భజించే వాడు జ్ఞాని. వారు ముగ్గురూ ఆత్మీయులైతే ఇతడు కేవల మాత్మరూపుడే. కనుకనే జ్ఞాని వారండరి కన్నా విశిష్ఠుడు.
అయితే ఇంత ఉత్పుష్టమైన స్థానాన్ని ఎలా అందుకో గలిగాడు జ్ఞాని. అతని ఆత్మ సంయమం అలాంటిది. పరిపూర్ణమైన చైతన్యాన్ని తప్ప సృష్టిలో మరేది కానీ దర్శించ డతడు. తానూ చైతన్యమే తాను చూచే జగత్తూ చైతన్యమే. రెంటికీ అతీతమని భావించే ఈశ్వరుడూ చైతన్యమే అతని దృష్టికి. అలాంటి దృష్టికి ఇక భేద మేముంటుంది సృష్టిలో. భేదమే లేదంటే దూరం దగ్గర అనే పరామర్శ ఏముంది. తానే సర్వమూ అనే పరిపూర్ణ భావ మయత్నంగానే సిద్ధిస్తుంది కాబట్టి సర్వోత్కృష్టుడైనవాడు జ్ఞాని ఒక్కడే.