ఉత్తరార్ధమ్
116
యత్ర యోగేశ్వరః కృష్ణో-యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతి-ర్థువానీతి ర్మతిర్మమ 18-78
పరోక్షంగా ఇలాంటి గురుపదేశ ప్రసాదాన్ని తాను సంపాదించి తన ధన్య త్వాన్ని సాధక లోకాని కిలా చాటుతున్నాడు ప్రస్తుతం సంజయుడు.
సమస్త యోగాలకూ మూలకందమైన శ్రీ కృష్ణపరమాత్మ ఎక్కడ ఉంటాడో ఎక్కడ ధనుర్థరుడై పార్థుడు నిలిచి ఉంటాడో అక్కడే శ్రీ విజయమూ భూతీ- నీతీ - అవశ్యముండీ తీరుతాయని నా అభిప్రాయ మంటాడు.
సమ్యగ్జయోస్యా స్తీతి సంజయః - సంజయతీతి సంజయః తాను జయ మును సాధించి దానిని మరలా పరులకు ప్రసాదించేవాడు సంజయుడు. మానవుడు సాధించవలసిన ఆ జయమేమిటి. " ఇహైన తైర్జిత స్సర్గః" అని గీతా వాక్యమే బయట పెట్టిందది ఏమిటో. సృష్టి రహస్యాన్ని ఛేదించటమే జయం. సృష్టి రహస్యంనామ రూపాత్మకంగా విస్తరించి ఉన్న ఈ సమస్తమూ కేవలసచ్చిదాత్మకమైనతత్త్వమేగాని మనేమీ కాదని గ్రహించటమే.
ఈ విధంగా గ్రహించి విజయంపొందిన వాడే సంజయుడు. సిద్ధుడయి మిగతా సాధకుల కందరికీ బోధిస్తున్నా డారహస్యాన్ని. ఏమని. యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడెక్కడ ఉంటాడో - అంటే ఏమని అర్ధం. "కర్షతీతి కృష్ణః" పైకిలాగే వాడెవడో వాడు కృష్ణుడు. "తేషా మహం సముద్ధర్తా" అని ఆయనే సెలవిచ్చాడు గదా. మృత్యురూపమైన ఈ సంసార సాగరంనుంచి బయటపడ వేసే నేర్పు పరమాత్మకే వుంది. కారణం యోగేశ్వరుడు. కర్మ జ్ఞాన భక్తి సమాధి యోగాలన్నీ ఆయన వశంలో ఉన్నాయి. లేదా మిగతా మూడింటినీ తనలో ఇముడ్చుకొన్న జ్ఞానయోగానికే ఈశ్వరుడాయన. దాని నీ మానవులకు ప్రసాదించి తద్బలంతో తరింపచేయగల డీ సంసారసాగరాన్ని.
అయితే ఇలాంటి తారకమైన యోగాన్ని ఆయన ప్రసాదించాలన్నా తద్వారా మనలను ఉద్దరించాలన్నా మనమెలాంటి యోగ్యత కలిగి ఉండాలని ప్రశ్న. ఎందుకంటే ఎంత కరుణాళుడైనా భగవానుడు అలసులనూ- అయోగ్యులనూ కాపాడబోడు. అది వట్టిమాట. గట్టి సాధన కుపక్రమించిన మానవునికే ఆయన చేయూత నిచ్చేది. ఉద్దరించేది. కనుక అలాంటి యోగ్యత ఏదో వర్ణిస్తున్నాడు- "యత్రపార్దో ధనుర్ధరః అని. పార్థుడంటే అర్జునుడనే కాదు. అర్జునుడికి నరుడని కూడా నామాంతరమున్నది. నరుడంటే మనమే. మనమూ పార్ధులమే. పృధివీ వికారమే పార్థం-పార్టీపం, పార్థివమైనదీ నర శరీరం. దీనితో సంపర్కం వదిలితేగాని మనం సాయుజ్యానికి నోచుకో లేమని చెప్పాము. అది వదిలే ఉపాయం ధనుర్ధరత్వం. "ప్రణవో ధను శ్శరో హ్యత్మా" అన్నారు. ధనుస్సంటే శబ్దబ్రహ్మం. అంటే బ్రహ్మాకారవృత్తి. దానినే నిత్యమూ ధరించి ఉండాలి సాధకుడు. క్రమంగా అది పరిపాకానికి వస్తే ముక్తి అనేది పూలబాట అవుతుంది.
ఇలాంటి గురుశిష్యభావ ముంటే ఒక మానవుడికి ఫలించనిదంటూ ఏదీ లేదు. వృత్త్యను సంధానంలో శిష్యుడు త్వంపదార్థ శోధన చేసుకొంటే చాలు. తత్పదార్థాక్యాన్ని గురువు వెంటనే ప్రసాదించి తీరుతాడు. దానితో ఇక ఐహిక మేమిటి. అముష్మికమేమిటి. రెండూ సిద్దిస్తాయి మానవుడికి. ఐహికం శ్రీ విజయాలైతే - ముష్మికం భూతినీతులు. కావలసినవన్నీ వచ్చి వరిస్తే అది శ్రీ. ఇష్టం లేనివన్నీ తొలగిపోతే అది విజయం. ఇవి ఐహికఫలం. పోతే ఇక సమస్తసృష్టికీ మూలమైన బ్రహ్మమే నేనైతే అది భూతి. దానితో సృష్టినంతా మరలా నడపగలిగితే అది నీతి. ఇవి అముష్మికఫలం. దీనితో అసిపదార్థంకూడా సిద్దించి -తత్త్వమసి మహా వాక్యార్థానికే సాధకుడి జీవితం లక్ష్యమవుతుంది. గీతా సందేశం కూడా దీనితో పరిసమాప్తమవుతుంది.
ఇతి
సాధక గీతా యామ్ ఉత్తరార్ధమ్ సమాప్తమ్.
సాధక గీతార్ధము - నవ
బోధము గావించు కొనిన పుణ్యాత్ములు -ని
ర్బాధ మగు మోక్ష పదవిని
సాధించుట కున్నె యెట్టి సందే హంబున్
***
సమాప్తం