కర్మ యోగము
భగవద్గీత
సాక్షి మాత్రుడవు సాక్షి రూపమైన ఆత్మను పట్టుకోమని వాడికెంత బోధించి ఏమి ప్రయోజనం
మరి తత్త్వవేత్త కైతే నీవు చెప్పనే అక్కరలేదు. తత్త్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః - ప్రకృతి గుణాలేవో అవి సాగించే కర్మలేవో బాగా వివేచన చేసి చూడగలవాడే తత్త్వవేత్త. అలాటివాడు తాను వాటికి సాక్షినని భావిస్తాడేగాని కర్తనని భోక్తనని కలలో కూడా బోల్తాపడడు. గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా - ప్రకృతి గుణాలు ఇంద్రియాలుగా మారి ఆయా కర్మలుగా మారిన ఆ గుణాలతోనే గుడుగుడు గుంచ మాడుతున్నాయి. మనకేమి సంబంధమని వివేక బుద్ధితో దర్శించగలడు. నసజ్జతే - అలా దర్శిస్తూ తన సాక్షి భావమెప్పుడు గుర్తించాడో అప్పుడిక వాడు వాటిలో తగులుకొనే ప్రసక్తే లేదు. సక్తుడు కాడు వాడు. ముక్తుడు.
ప్రకృతే ర్గుణ సమ్మూఢాః - సజ్జంతే గుణ కర్మసు
తా నకృత్పృవిదో మందాన్ - కృత్న్సవి న్నవిచాలయేత్ - 29
అసలు విషయ మేమంటే ప్రపంచ మంటేనే అది త్రిగుణాత్మకం. మానవుడూ వాడి బుద్ధీ త్రిగుణాత్మకమే. అందులోనూ రజోగుణ ప్రధానుడు మానవుడు. రజస్సు చలనాత్మకమైన గుణం. కనుకనే మనసెప్పుడూ చలిస్తుంటుంది. ఆ పనీ ఈ పనీ చేయాలని ప్రాకులాడు తుంటుంది. ప్రకృతే ర్గుణ సమ్మూఢాః - ప్రకృతి గుణాలు వారి బుద్ధి నిటూ అటూ తిప్పి స్తిమితత లేకుండా చేస్తుంటాయి. సజ్జంతే గుణ కర్మసు - అంచేత వాడసలు విషయ మాలోచించ లేడు. అలాటి సామర్ధ్యం కోలుపోయాడు
Page 252