బ్రహ్మ సూత్రాల ద్వారా మననం చేసి పోగొట్టుకోవాలి మనం. అప్పుడు సంశయం పోయి అంతా ఈశ్వరుడే ననే నిశ్చయ జ్ఞాన ముదయిస్తుంది. అయితే అది మానసికమే గాని ఆ అద్వైత భావం జీవితంలో అనుభవానికి వస్తుందా అని సందేహం. దానికి జవాబిస్తుంది మూడవది భగవద్గీత. ఆ జవాబే నిది ధ్యాస. నిది ధ్యాస అంటే ఏది చూచినా పరమాత్మే ననే దృష్టి వదలకుండా చూడటం.
ఇలా శ్రవణ మనన నిది ధ్యాసలనే మూడు దశలలో ప్రయాణం చేస్తే చాలు. చివరకు విషాదమనే సమస్య తప్పకుండా పరిష్కారమయి మోక్షమనే మహాఫలం సిద్ధించి తీరుతుంది. కనుకనే మూడింటికీ కలిపి ప్రస్థాన త్రయమనే పేరు సార్ధకంగా పెట్టారు శాస్త్రజ్ఞులు. కనుక జీవిత గమ్యమైన పురుషార్థమందు కోవాలంటే ప్రతి భారతీయుడికీ ఈ ప్రస్థాన త్రయమనేదిచదివి అర్థం చేసుకోవలసిన బాధ్యత
Page 5