ఇప్పుడీ మూడింటికీ కలిపి ప్రస్థానత్రయమని పేరు పెట్టారు మన ప్రాచీనులు. ప్రస్థానమంటే విషాదమనే సమస్యను తొలగించుకొనే మార్గం. విషాదం సమస్య అయితే మోక్షమనేది దానికి పరిష్కారం. పరిష్కార మార్గం ఒకటే అయినా అది అంచెలవారీగా ప్రయాణంచేసి అందుకోవాలి సాధకుడు. అవి మూడు భూమికలు. ఒకటి శ్రవణం. ఉన్నదంతా ఒకే ఒక ఈశ్వర చైతన్యం. అదే మన స్వరూపం. అంతకు మించి ప్రపంచమనేది వేరుగా లేదు -అని వేదాంతుల సిద్ధాంతం. అది ముందు ఉపనిషత్తుల ద్వారా మనం శ్రవణం చేసి గ్రహించాలి. మరి చరా చర ప్రపంచ మొకటి మన చుట్టూ ప్రతిక్షణమూ చూస్తున్నాము గదా. దీనివల్లనే గదా మనకీ బాధలన్నీ. అలాంటప్పుడిదంతా పరమాత్మే నని ఎలా అర్థం చేసుకోవాలనే సందేహ మేర్పడితే దాన్ని
Page 4