#


Index

ప్రస్థానత్రయ సారము

ఛాందోగ్యోపనిషత్తు

  పోతే ఇక రెండుపనిషత్తు లున్నాయి. ఛాందోగ్య మొకటి. బృహదారణ్య మొకటి. ఛాందోగ్యం తత్త్వమసి - నీవు పరమాత్మవేనని మనకు పదేశిస్తుంది. బృహదారణ్యకం అహంబ్రహ్మాస్మి - నేనా పరమాత్మనే అని జీవుడికా ఉపదేశ మనుభవానికి తెస్తుంది. కాని జీవుడికీ జగత్తనేది ఇలా కనిపిస్తున్న వరకూ నీవు పరమాత్మవేనని చెప్పినా ప్రయోజనం లేదు. కనుక ఐతదాత్య మిదగం సర్వం ఇదంతా కూడా ఆత్మ స్వరూపమేనని దీన్ని ఆత్మ చైతన్యంలో లయం చేసి చూపుతుంది ఛాందోగ్యం. జగత్తులయమైతే చాలు. జీవుడ ప్రయత్నంగా ఈశ్వర స్వరూపుడే అవుతాడు.

  కాని జగత్తు ఎలా లయమవుతుంది. జగత్తనేది ఒక కార్యం. అంటే ఒక దాని నుంచి తయారయింది. నుంచి తయారయిందో అది దీనికి కారణం. కారణం కంటే దాని కార్యం వేరుగాదని సిద్ధాంతం. మట్టి కన్నా కుండ వేరు గాదు గదా. బంగారం కన్నా ఆభరణం వేరు గాదు గదా. అలాగే అస్తిభాతి. ఉన్నదనే స్ఫురణ కంటే లోకంలో ఏ పదార్ధం కానీ అన్యంగా లేదు. ఏదైనా ఉన్నట్టు స్ఫురించేదే. ఉందనే స్ఫురణ తీసేస్తే ఆ పదార్ధమే లేదు.

Page 23

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు